కాంగ్రెస్ బలోపేతానికి అందరం కలిసికట్టుగా పని చేయాలి
కాంగ్రెస్ బలోపేతానికి అందరం కలిసికట్టుగా పని చేయాలి
Biksham
ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి
సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం
సూర్యాపేట నియోజకవర్గంలోని పెన్ పహాడ్ మండలం చిన్న సీతారాం తండా గ్రామ కాంగ్రెస్ నాయకులు హైదరాబాద్లోని వైట్ హౌస్లో ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గ్రామంలో నెలకొన్న సమస్యలు, తండా అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాలు, పార్టీ సంస్థాగత బలోపేతం అంశాలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో అన్ని వర్గాల అభివృద్ధి కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని, గిరిజన తండాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి తెలిపారు. పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో మరింత చురుకుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన సూచించారు. చిన్న సీతారాం తండా గ్రామ అభివృద్ధికి అవసరమైన సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మండల, గ్రామ స్థాయి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి