Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మద్యానికి చెక్… నీర్నములలో సంచలన నిర్ణయం సర్పంచ్ కందిమల్ల గోపాల్ రెడ్డి “500 గర్భిణులను బైక్‌లో రక్షించిన ప్రాణదాత: ఛత్తీస్‌గఢ్ ‘బైక్ హీరో’ సురేష్ బెల్సారే” “మండల మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో ఆర్టీసీకి అద్దె బస్సులు… మహిళల ఆర్థిక సాధికారతకు కొత్త దిశ : సి‌ఎం రేవంత్” చెన్నైపై రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం.. సూర్యవంశీ ఊచకోత! రామోత్సవం ఘనంగా నిర్వహణ – భక్తులకు ఆధ్యాత్మిక సందేశాలు “పరిశోధనలతోనే ఉన్నత విద్యకు నాణ్యత: అకాడమిక్ కౌన్సిల్‌లో చర్చ” అమరావతి శాశ్వత రాజధాని తీర్మానంపై హర్షం వ్యక్తం చేసిన రంగేపల్లి వెంకటరమణ “డబ్బు కోసం జీవితాన్ని వదులుకుంటాం… చివరికి ఆ డబ్బుతోనే జీవితాన్ని కొనలేము… ఇదే నిజం!” “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 03, 2026 09:30 PM

కాంగ్రెస్‌తోనే పేదల ఇంటి కల సాకారం- సర్పంచ్ జువ్వి నరసింహ

కాంగ్రెస్‌తోనే పేదల ఇంటి కల సాకారం- సర్పంచ్ జువ్వి నరసింహ

కాంగ్రెస్‌తోనే పేదల ఇంటి కల సాకారం- సర్పంచ్ జువ్వి నరసింహ
April 03, 2026 07:38 PM 12 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ధర్మోజి గూడెంలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం

కాంగ్రెస్ ప్రభుత్వంతోనే నిరుపేదల సొంతింటి కల నెరవేరుతుందని ధర్మోజి గూడెం సర్పంచ్ జువ్వి నర్సింహ్మ అన్నారు. చౌటుప్పల్ మండలం ధర్మోజి గూడెం గ్రామంలో బోనకుర్తి సునీత-హరికృష్ణ దంపతుల ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సర్పంచ్ జువ్వి నర్సింహ్మ కొత్త ఇంటిని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ పథకం ద్వారా పేదలకు ఇళ్లు కల్పించడం జరుగుతోందన్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో బోనకుర్తి సునీత-హరికృష్ణలు తమ సొంతింటి కలను సాకారం చేసుకున్నారని తెలిపారు. పేదల పక్షాన నిలిచేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, నిరుపేదల అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తోందని అన్నారు. త్వరలోనే రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రారంభమవుతుందని, గ్రామంలో ఇల్లు లేని ప్రతి నిరుపేద కుటుంబానికి ఇల్లు కల్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పక్కీరు శ్రీనివాస్ రెడ్డి, వార్డు సభ్యులు ఊదరి శ్రీనివాస్, ఐతరాజు లింగస్వామి-శారద, రాచకొండ భార్గవ్, జీడిముడ్ల శోభ-కొండల్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు వల్లబోతు నారాయణ, మాజీ సర్పంచ్ బద్రి లింగయ్య, మాజీ ఉప సర్పంచ్‌లు బత్తుల శ్రీహరి, కొంతం బుచ్చిరెడ్డి, ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఊదరి శంకర్, ఊదరి నర్సింహ, డాకొజీ సతీష్, వల్లబోతు నరేష్, సురేష్, జంగం సందీప్, బత్తుల వినోద్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News