Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:08 AM

కాంగ్రెస్‌తోనే పేదల ఇంటి కల సాకారం- సర్పంచ్ జువ్వి నరసింహ

కాంగ్రెస్‌తోనే పేదల ఇంటి కల సాకారం- సర్పంచ్ జువ్వి నరసింహ

కాంగ్రెస్‌తోనే పేదల ఇంటి కల సాకారం- సర్పంచ్ జువ్వి నరసింహ
03-04-2026 48 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ధర్మోజి గూడెంలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం

కాంగ్రెస్ ప్రభుత్వంతోనే నిరుపేదల సొంతింటి కల నెరవేరుతుందని ధర్మోజి గూడెం సర్పంచ్ జువ్వి నర్సింహ్మ అన్నారు. చౌటుప్పల్ మండలం ధర్మోజి గూడెం గ్రామంలో బోనకుర్తి సునీత-హరికృష్ణ దంపతుల ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సర్పంచ్ జువ్వి నర్సింహ్మ కొత్త ఇంటిని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ పథకం ద్వారా పేదలకు ఇళ్లు కల్పించడం జరుగుతోందన్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో బోనకుర్తి సునీత-హరికృష్ణలు తమ సొంతింటి కలను సాకారం చేసుకున్నారని తెలిపారు. పేదల పక్షాన నిలిచేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, నిరుపేదల అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తోందని అన్నారు. త్వరలోనే రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రారంభమవుతుందని, గ్రామంలో ఇల్లు లేని ప్రతి నిరుపేద కుటుంబానికి ఇల్లు కల్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పక్కీరు శ్రీనివాస్ రెడ్డి, వార్డు సభ్యులు ఊదరి శ్రీనివాస్, ఐతరాజు లింగస్వామి-శారద, రాచకొండ భార్గవ్, జీడిముడ్ల శోభ-కొండల్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు వల్లబోతు నారాయణ, మాజీ సర్పంచ్ బద్రి లింగయ్య, మాజీ ఉప సర్పంచ్‌లు బత్తుల శ్రీహరి, కొంతం బుచ్చిరెడ్డి, ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఊదరి శంకర్, ఊదరి నర్సింహ, డాకొజీ సతీష్, వల్లబోతు నరేష్, సురేష్, జంగం సందీప్, బత్తుల వినోద్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కాంగ్రెస్‌తోనే పేదల ఇంటి కల సాకారం- సర్పంచ్ జువ్వి నరసింహ

Article Image

ధర్మోజి గూడెంలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం

కాంగ్రెస్ ప్రభుత్వంతోనే నిరుపేదల సొంతింటి కల నెరవేరుతుందని ధర్మోజి గూడెం సర్పంచ్ జువ్వి నర్సింహ్మ అన్నారు. చౌటుప్పల్ మండలం ధర్మోజి గూడెం గ్రామంలో బోనకుర్తి సునీత-హరికృష్ణ దంపతుల ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సర్పంచ్ జువ్వి నర్సింహ్మ కొత్త ఇంటిని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ పథకం ద్వారా పేదలకు ఇళ్లు కల్పించడం జరుగుతోందన్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో బోనకుర్తి సునీత-హరికృష్ణలు తమ సొంతింటి కలను సాకారం చేసుకున్నారని తెలిపారు. పేదల పక్షాన నిలిచేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, నిరుపేదల అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తోందని అన్నారు. త్వరలోనే రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రారంభమవుతుందని, గ్రామంలో ఇల్లు లేని ప్రతి నిరుపేద కుటుంబానికి ఇల్లు కల్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పక్కీరు శ్రీనివాస్ రెడ్డి, వార్డు సభ్యులు ఊదరి శ్రీనివాస్, ఐతరాజు లింగస్వామి-శారద, రాచకొండ భార్గవ్, జీడిముడ్ల శోభ-కొండల్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు వల్లబోతు నారాయణ, మాజీ సర్పంచ్ బద్రి లింగయ్య, మాజీ ఉప సర్పంచ్‌లు బత్తుల శ్రీహరి, కొంతం బుచ్చిరెడ్డి, ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఊదరి శంకర్, ఊదరి నర్సింహ, డాకొజీ సతీష్, వల్లబోతు నరేష్, సురేష్, జంగం సందీప్, బత్తుల వినోద్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News