కాంగ్రెస్తోనే పేదల ఇంటి కల సాకారం- సర్పంచ్ జువ్వి నరసింహ
కాంగ్రెస్తోనే పేదల ఇంటి కల సాకారం- సర్పంచ్ జువ్వి నరసింహ
K.RAVI
ధర్మోజి గూడెంలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం
కాంగ్రెస్ ప్రభుత్వంతోనే నిరుపేదల సొంతింటి కల నెరవేరుతుందని ధర్మోజి గూడెం సర్పంచ్ జువ్వి నర్సింహ్మ అన్నారు. చౌటుప్పల్ మండలం ధర్మోజి గూడెం గ్రామంలో బోనకుర్తి సునీత-హరికృష్ణ దంపతుల ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సర్పంచ్ జువ్వి నర్సింహ్మ కొత్త ఇంటిని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ పథకం ద్వారా పేదలకు ఇళ్లు కల్పించడం జరుగుతోందన్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో బోనకుర్తి సునీత-హరికృష్ణలు తమ సొంతింటి కలను సాకారం చేసుకున్నారని తెలిపారు. పేదల పక్షాన నిలిచేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, నిరుపేదల అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తోందని అన్నారు. త్వరలోనే రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రారంభమవుతుందని, గ్రామంలో ఇల్లు లేని ప్రతి నిరుపేద కుటుంబానికి ఇల్లు కల్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పక్కీరు శ్రీనివాస్ రెడ్డి, వార్డు సభ్యులు ఊదరి శ్రీనివాస్, ఐతరాజు లింగస్వామి-శారద, రాచకొండ భార్గవ్, జీడిముడ్ల శోభ-కొండల్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు వల్లబోతు నారాయణ, మాజీ సర్పంచ్ బద్రి లింగయ్య, మాజీ ఉప సర్పంచ్లు బత్తుల శ్రీహరి, కొంతం బుచ్చిరెడ్డి, ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఊదరి శంకర్, ఊదరి నర్సింహ, డాకొజీ సతీష్, వల్లబోతు నరేష్, సురేష్, జంగం సందీప్, బత్తుల వినోద్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి