కాంగ్రెస్లోకి 31వ వార్డు యువత భారీ చేరిక
కాంగ్రెస్లోకి 31వ వార్డు యువత భారీ చేరిక
Biksham
సూర్యాపేట పట్టణంలోని వైట్ హౌస్లో జరిగిన కార్యక్రమంలో 31వ వార్డుకు చెందిన యువ నాయకులు బిఆర్ఎస్, బిజెపి పార్టీలను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య సమక్షంలో కనుకు ప్రవీణ్ (కేపి), కమటం వెంకట్ రెడ్డి, అలి, రవితేజ, నర్సీ, లింగారెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొండపల్లి దిలీప్ రెడ్డి విజయం కోసం ఐక్యంగా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఎలిమినేటి అభినయ్ నాయుడు, నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జావేద్ బేగ్, కాంగ్రెస్ నాయకులు వెన్న శ్రీనివాస్ రెడ్డి, తాడూరి లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి