కాంగ్రెస్ తోనే వార్డు అభివృద్ధి
కాంగ్రెస్ తోనే వార్డు అభివృద్ధి
Biksham
గెలిచిన వెంటనే సొంత నిధులతో సీసీ కెమెరాలు
వార్డు అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని 14వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి పంతంగి దశరథ స్పష్టం చేశారు. శుక్రవారం 14వ వార్డులో నిర్వహించిన గడపగడప ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, తాను కౌన్సిలర్ గా గెలిచిన వెంటనే తన సొంత నిధులతో వార్డులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి భద్రతను మరింత బలోపేతం చేస్తానని హామీ ఇచ్చారు.ప్రచారంలో భాగంగా వార్డు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోందని పంతంగి దశరథ తెలిపారు. ప్రజలు తనను సొంత బిడ్డ వలె ఆదరిస్తూ ఆశీర్వదిస్తున్నారని, ముఖ్యంగా మహిళలు, యువత, ఆడబిడ్డలు పెద్ద ఎత్తున అండగా నిలుస్తున్నారని అన్నారు. ప్రతి వీధిలో కాంగ్రెస్ పార్టీకి జై కొడుతూ ప్రజానీకం ఉత్సాహంగా మద్దతు తెలుపుతుండటం తనకు మరింత బాధ్యతను పెంచిందని పేర్కొన్నారు.వార్డు ప్రజల భద్రత, సంక్షేమమే తన ప్రధాన లక్ష్యమని చెప్పారు. వీధుల్లో భద్రత పెంచేందుకు సీసీ కెమెరాల ఏర్పాటు చేయడమే కాకుండా, పారిశుధ్యం, తాగునీరు, రహదారులు, వీధిదీపాలు వంటి మౌలిక వసతుల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వెంటనే పరిష్కరించే కౌన్సిలర్ గా పనిచేస్తానని హామీ ఇచ్చారు.
తెలంగాణ ప్రజా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రతి సంక్షేమ పథకాన్ని 14వ వార్డులోని ప్రతి ఇంటికి చేరవేస్తానని పంతంగి దశరథ స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాల లబ్ధి అందేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటానని, ఎవరూ మోసపోకుండా చూస్తానని అన్నారు.త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో అన్ని వార్డులలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజల ఆశీస్సులతో 14వ వార్డులో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేస్తామని తెలిపారు.ఈ ప్రచార కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ గోదాల రంగారెడ్డి, మాజీ జెడ్పిటిసి రాజేష్ నాయక్, నాయకులు పాండు నాయక్, లింగంపల్లి సృజన్, వరిపల్లి శంకర్, వరిపల్లి లక్ష్మయ్య, ఉమేష్, వెంకటేష్, కృష్ణ, మహేష్ తదితరులు పాల్గొని తమ మద్దతు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి