కాంగ్రెస్ సీనియర్ నేత కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ
కాంగ్రెస్ సీనియర్ నేత కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ
స్థానికం బృందం
రామన్నపేట మండల కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కోట సుధాకర్ తల్లి సోమ లక్ష్మమ్మ ఇటీవల మృతి చెందగా, కుటుంబాన్ని పరామర్శించి సానుభూతి తెలిపారు వేముల వీరేశం. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను ఓదార్చిన ఎమ్మెల్యే, సోమ లక్ష్మమ్మ సేవలను స్మరించుకున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
పరామర్శ కార్యక్రమంలో రామన్నపేట మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ గరిక సత్యనారాయణ, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మొహమ్మద్ జమీరుద్దీన్, జిల్లా కాంగ్రెస్ నాయకులు వనం చంద్రశేఖర్, గోదాసు పృథ్వీరాజ్, ఎండీ రెహాన్, సాల్వేర్ అశోక్, బొడ్డు సాలయ్య, కొత్తపల్లి అబ్రహం కుమార్, ఆముద లక్ష్మణ్, మొహమ్మద్ రిజ్వాన్, మొహమ్మద్ అజార్, మొహమ్మద్ కరీం, గొలుసుల ప్రసాద్, లెంకల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. వార్డ్ సభ్యులు కొమ్ము శేఖర్, అబ్దుల్ వహీద్, కందుల శివ, గొరిగె శేఖర్ తదితరులు హాజరై కుటుంబానికి ధైర్యం చెప్పారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి