Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
Community Power for Health: Walkathon Sparks Preventive Care Movement సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 01:52 PM

కాంగ్రెస్ పార్టీతోనే వార్డుల అభివృద్ధి సాధ్యం

కాంగ్రెస్ పార్టీతోనే వార్డుల అభివృద్ధి సాధ్యం

కాంగ్రెస్ పార్టీతోనే వార్డుల అభివృద్ధి సాధ్యం
February 08, 2026 03:18 PM 232 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

13 వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి బత్తుల వాణి విప్లవ్ కుమార్ గౌడ్

చౌటుప్పల్ మున్సిపాలిటీలోని 13వ వార్డు అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అని కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి బత్తుల వాణి విప్లవ్ కుమార్ గౌడ్ అన్నారు. ఆదివారం 13వ వార్డులో గడపగడపకు ప్రచారం నిర్వహించారు. 13వ వార్డు అభివృద్ధి కోసం చేయి గుర్తుకు తమ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ..అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే అనేక అత్యధిక సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేసిన ఘనత కాంగ్రెస్ కు దక్కుతుందన్నారు.పేద కుటుంబాలకు అండగా ఉంటూ, మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో 13వ వార్డులోని అభివృద్ధి పనులను శరవేగంగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.13వ వవార్డులో సమగ్ర అభివృద్ధి కొనసాగాలంటే వార్డు ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టాలన్నారు.అభివృద్దే ధ్యేయంగా ప్రజా సేవే లక్ష్యంగా మీ ముందుకు వస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఆశీర్వదించాలని ఓటర్లకు తెలియజేశారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో అధిక నిధులు తీసుకువచ్చి వార్డును ఆదర్శంగా వార్డుగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు వివరిస్తూ ఈనెల 11న జరగనున్న ఎన్నికల్లో చేతి గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి అభివృద్ధికి బాటలు వేయాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జిలు వర్కాల కుమార్ గౌడ్, చేవగోని వెంకటేష్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మార్గం నరసింహ, తోర్పునూరి బాబు, మహిళలు, యువకులు, అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News