కాంగ్రెస్ పార్టీతోనే వార్డుల అభివృద్ధి సాధ్యం
కాంగ్రెస్ పార్టీతోనే వార్డుల అభివృద్ధి సాధ్యం
K.RAVI
13 వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి బత్తుల వాణి విప్లవ్ కుమార్ గౌడ్
చౌటుప్పల్ మున్సిపాలిటీలోని 13వ వార్డు అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అని కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి బత్తుల వాణి విప్లవ్ కుమార్ గౌడ్ అన్నారు. ఆదివారం 13వ వార్డులో గడపగడపకు ప్రచారం నిర్వహించారు. 13వ వార్డు అభివృద్ధి కోసం చేయి గుర్తుకు తమ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ..అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే అనేక అత్యధిక సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేసిన ఘనత కాంగ్రెస్ కు దక్కుతుందన్నారు.పేద కుటుంబాలకు అండగా ఉంటూ, మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో 13వ వార్డులోని అభివృద్ధి పనులను శరవేగంగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.13వ వవార్డులో సమగ్ర అభివృద్ధి కొనసాగాలంటే వార్డు ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టాలన్నారు.అభివృద్దే ధ్యేయంగా ప్రజా సేవే లక్ష్యంగా మీ ముందుకు వస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఆశీర్వదించాలని ఓటర్లకు తెలియజేశారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో అధిక నిధులు తీసుకువచ్చి వార్డును ఆదర్శంగా వార్డుగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు వివరిస్తూ ఈనెల 11న జరగనున్న ఎన్నికల్లో చేతి గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి అభివృద్ధికి బాటలు వేయాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జిలు వర్కాల కుమార్ గౌడ్, చేవగోని వెంకటేష్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మార్గం నరసింహ, తోర్పునూరి బాబు, మహిళలు, యువకులు, అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి