కాంగ్రెస్ పార్టీతో కలిసి నడుద్దాం – నారాయణఖేడ్ అభివృద్ధి ఖాయం
కాంగ్రెస్ పార్టీతో కలిసి నడుద్దాం – నారాయణఖేడ్ అభివృద్ధి ఖాయం
Krishna
నారాయణఖేడ్ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు ఉదయం ఉమ్మడి జిల్లా మాజీ ప్రణాళిక సంఘం సభ్యులు నాగేష్ శెట్కార్ 08, 11, 15 వార్డులలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ప్రజల మధ్యకు వెళ్లి ప్రతి ఇంటిని సందర్శిస్తూ,ప్రతి గడపను తట్టుతూ ఉత్సాహంగా ప్రచారం కొనసాగించారు.నారాయణాఖేడ్ మున్సిపాలిటీ అభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.గత రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాల గురించి ప్రజలకు వివరించారు.కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు మరింత వేగంగా జరుగుతాయని తెలిపారు. ప్రతి వార్డులో ఉన్న సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకువస్తే, సంబంధిత శాఖల ద్వారా నిధులు తీసుకువచ్చి పరిష్కారం చేసే బాధ్యత తమదేనని భరోసా ఇచ్చారు.ప్రజల శ్రేయస్సే ధ్యేయంగా పనిచేసే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను హృదయపూర్వకంగా కోరారు.ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు కె. శ్రీనివాస్, మాజీ జడ్పీ కో-ఆప్షన్ సభ్యులు రషీద్, ఖేడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తాహిర్ అలీ, మాజీ ఎంపీటీసీ సభ్యులు మూతజ్,పండరి రెడ్డి, వార్డు సభ్యులు అస్మా పర్వీన్, అసిఫ్, గోపాల్ రెడ్డి తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి