కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు
కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు
Biksham
ఇరవై మంది నాయకుల చేరికతో 22వ వార్డులో జోష్
మున్సిపాలిటీ 22వ వార్డు కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎలుగూరి అలివేలుచంటి బాబు ఆధ్వర్యంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు జరిగాయి. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఇరవై మంది నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.రాష్ట్రంలో, జిల్లాలో కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి పథకాలకు ఆకర్షితులై పార్టీ మారుతున్నట్లు చేరిన నాయకులు తెలిపారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తోందని, అందుకే ఆ పార్టీని ఆశ్రయించినట్లు పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఎలుగూరి అలివేలుచంటి బాబు మాట్లాడుతూ, 22వ వార్డులో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతోందని, ప్రజల నమ్మకంతో రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. చేరిన నాయకులకు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి