Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డ్రైవర్ అశోక్‌కు క్లీన్చిట్” ప్రభుత్వం వెనక్కి.. సస్పెన్షన్ చర్యలు లేవన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 08:51 PM

కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు

కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు

కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు
February 08, 2026 05:46 PM 134 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ఇరవై మంది నాయకుల చేరికతో 22వ వార్డులో జోష్

మున్సిపాలిటీ 22వ వార్డు కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎలుగూరి అలివేలుచంటి బాబు ఆధ్వర్యంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు జరిగాయి. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఇరవై మంది నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.రాష్ట్రంలో, జిల్లాలో కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి పథకాలకు ఆకర్షితులై పార్టీ మారుతున్నట్లు చేరిన నాయకులు తెలిపారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తోందని, అందుకే ఆ పార్టీని ఆశ్రయించినట్లు పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఎలుగూరి అలివేలుచంటి బాబు మాట్లాడుతూ, 22వ వార్డులో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతోందని, ప్రజల నమ్మకంతో రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. చేరిన నాయకులకు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News