Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 03:50 AM

కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు

కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు

కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు
February 08, 2026 05:46 PM 140 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ఇరవై మంది నాయకుల చేరికతో 22వ వార్డులో జోష్

మున్సిపాలిటీ 22వ వార్డు కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎలుగూరి అలివేలుచంటి బాబు ఆధ్వర్యంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు జరిగాయి. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఇరవై మంది నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.రాష్ట్రంలో, జిల్లాలో కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి పథకాలకు ఆకర్షితులై పార్టీ మారుతున్నట్లు చేరిన నాయకులు తెలిపారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తోందని, అందుకే ఆ పార్టీని ఆశ్రయించినట్లు పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఎలుగూరి అలివేలుచంటి బాబు మాట్లాడుతూ, 22వ వార్డులో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతోందని, ప్రజల నమ్మకంతో రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. చేరిన నాయకులకు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News