Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 23, 2026 08:39 PM

కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్.. బిఆర్ఎస్ లోకి సీనియర్ నేతల చేరిక

కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్.. బిఆర్ఎస్ లోకి సీనియర్ నేతల చేరిక

కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్.. బిఆర్ఎస్ లోకి సీనియర్ నేతల చేరిక
February 01, 2026 05:17 PM 507 Views
Reporter
స్థానికం ప్రతినిధి : CHOUTUPPAL MANDAL
K.RAVI

చౌటుప్పల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి భారీ రాజకీయ ఎదురు దెబ్బ తగిలింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతల ఉమామహేశ్వరి, సాయిలు తమ పార్టీ క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేసి బిఆర్ఎస్ పార్టీలో చేరారు.మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సమక్షంలో వారు గులాబీ కండువా కప్పుకున్నారు.ఈ సందర్భంగా నూతనంగా బీఆర్ఎస్ లో చేరిన నేతలు మాట్లాడుతూ, చౌటుప్పల్ మున్సిపాలిటీ అభివృద్ధి కేవలం బిఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం,పట్టణ అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనలో బిఆర్ఎస్ ప్రభుత్వ పాలనకు స్పష్టమైన దిశ విధానం ఉన్నాయని పేర్కొన్నారు.రానున్న మున్సిపల్ ఎన్నికల్లో చౌటుప్పల్ లో ఎగిరేది బిఆర్ఎస్ జెండానేనని ధీమా వ్యక్తం చేశారు.మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజల నమ్మకాన్ని కోల్పోయిన కాంగ్రెస్ పార్టీని విడిచి బిఆర్ఎస్ వైపు ప్రజలు, అన్ని పార్టీల నాయకులు ఆకర్షితులవుతున్నారని తెలిపారు. చౌటుప్పల్ లో బిఆర్ఎస్ ను మరింత బలోపేతం చేసి మున్సిపాలిటీ పై గులాబీ జెండా ఎగరవేయడమే లక్ష్యమని తెలిపారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని నూతన సభ్యులను ఘనంగా స్వాగతించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News