కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అభ్యర్థుల విజయ లక్ష్యం:ఖేడ్లో సన్నాహక సమావేశం ఘనంగా
కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అభ్యర్థుల విజయ లక్ష్యం:ఖేడ్లో సన్నాహక సమావేశం ఘనంగా
Sthanikam District Staff Reporter krishna
నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ
నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణంలోని సాయిబాబా ఫంక్షన్ హాల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షేట్కార్, నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పి సంజీవరెడ్డి,రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పి చంద్రశేఖర్ రెడ్డి,మాజీ జిల్లా ప్రణాళిక సంఘం సభ్యులు నగేష్ కుమార్ షేట్కార్ హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎంపీ ,శాసనసభ్యులు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల వ్యవధిలోనే నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణంలో అనేక సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేశామని తెలిపారు. పట్టణంలోని ప్రతి మున్సిపల్ వార్డులో నాణ్యమైన మురుగు కాలువలు, సిమెంట్ రోడ్ల నిర్మాణం చేపట్టి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించామని అన్నారు.పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమని తెలిపారు.ఈ లక్ష్యానికి అనుగుణంగా అర్బన్ ఫారెస్ట్ ఏర్పాటు, చౌరస్తాల సుందరీకరణ పనులు చేపట్టామని చెప్పారు. గతంలో ఎవరూ ఆలోచించని విధంగా పట్టణంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను దృష్టిలో పెట్టుకొని నారాయణఖేడ్ పట్టణం చుట్టూ లింక్ రోడ్లను అనుసంధానం చేస్తూ రింగ్ రోడ్డును ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.
రాబోయే మున్సిపల్ ఎన్నికలు ఎంతో కీలకమైనవని, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను ప్రతి వార్డులో భారీ మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అందరం కలిసికట్టుగా పనిచేస్తే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.ఈ సమావేశంలో మున్సిపల్ పట్టణ మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి