కాంగ్రెస్ ను గెలిపించి అభివృద్ధి చేసుకోవాలి
కాంగ్రెస్ ను గెలిపించి అభివృద్ధి చేసుకోవాలి
K.RAVI
మునుగోడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఇంచార్జ్ పబ్బు రాజు గౌడ్
చౌటుప్పల్ మున్సిపాలిటీ 12వ వార్డులో ఇంటింటి ప్రచారానికి ముఖ్య అతిథిగా మునుగోడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఇన్చార్జ్ పబ్బు రాజు గౌడ్ పాల్గొని మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ హయాంలో రోడ్లు, రేషన్ కార్డులు, ఫ్రీ బస్సు, రైతు రుణమాఫీ, గృహ జ్యోతి, సీఎం రిలీఫ్ ఫండ్, ఎల్ఓసి చెక్కులు, వంటి పథకాలు రాష్ట్రవ్యాప్తంగా అమల్లో ఉన్నాయని, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమస్య ఉందని వెళ్తే తక్షణమే పరిష్కరిస్తారని, వార్డును అభివృద్ధి చేసే కాంగ్రెస్ పార్టీ నాయకుడు నిస్వార్ధంగా మీ సమస్యలు ఎప్పుడు మా దృష్టికి తీసుకువచ్చే పాక చిరంజీవి కి ఓటు వేసి గెలిపించగలరని వార్డులో చేసినా అభివృద్ధికి పట్టం కట్టాలని పార్టీ ప్రజలకు వార్డు సభ్యులందరికీ తెలియజేశారు. మహిళలతో ర్యాలీ తీసి ఓటు అభ్యర్థించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 12వ వార్డు అధ్యక్షులు చెరుకు లింగస్వామి, సీతా రామచంద్రస్వామి దేవాలయం గుడి కమిటీ చైర్మన్ బొబ్బిళ్ళ మురళి, మాజీ సర్పంచ్ బొంగు జంగయ్య గౌడ్, కంచర కుంట్ల వెంకట్ రెడ్డి, మాజీ వార్డ్ మెంబర్ బుంగపట్ల భారతమ్మ, మాజీ కౌన్సిలర్ సుల్తాన్ రాజు, వార్డ్ ఇన్చార్జిలు మాధగొని శేఖర్ గౌడ్, బక్క శ్రీనాథ్, తీగుళ్ల బాలరాజు, పార్టీ సీనియర్ నాయకులు తమ్మ కొండ రాజు, మాస సుధాకర్, మానుపాటి వెంకటేశ్వర్, బొమ్మ కంట శివ, సుల్తాన్ శేఖర్, జాజుల శివ, అల్లి కృష్ణ, సాయి, కంచరకుంట్ల శశిధర్ రెడ్డి, తేలుకుంట్ల నవీన్, మహిళా నాయకురాలు మాజీ ఉపసర్పంచ్ పాక పద్మ, బొబ్బిల సంధ్య, రెడ్డి లక్ష్మి, చిందం జ్యోతి, జిట్టం కవిత, కౌసల్య, బుడ్డా దివ్య తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి