కాంగ్రెస్ నాయకుల కుట్రతోనే ఓటమి
కాంగ్రెస్ నాయకుల కుట్రతోనే ఓటమి
K.RAVI
కానుగు యాదమ్మ బాలరాజు ఆరోపణ
7వ వార్డు భీఆర్ఎస్ అభ్యర్థి
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) తరఫున చౌటుప్పల్ మున్సిపాలిటీ 7వ వార్డు నుంచి పోటీ చేసిన అభ్యర్థి కానుగు యాదమ్మ బాలరాజు తన ఓటమికి కాంగ్రెస్ నాయకుల కుట్రే కారణమని ఆరోపించారు. బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.7వ వార్డు ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మొదటగా ప్రకటించిన ఫలితాల్లో తనను విజేతగా ప్రకటించారని, అనంతరం రీకౌంటింగ్ నిర్వహించి కాంగ్రెస్ అభ్యర్థి గెలిచినట్లు వెల్లడించారని తెలిపారు.
అధికార పార్టీ నాయకులు రిటర్నింగ్ అధికారులతో కుమ్మక్కై బ్యాలెట్ పేపర్లను తారుమారు చేశారని ఆరోపించారు. తనకు వచ్చిన ఓట్లను కాంగ్రెస్ అభ్యర్థికి మళ్లించారని పేర్కొన్నారు. మున్సిపాలిటీకి సంబంధంలేని కాంగ్రెస్ నాయకులను కౌంటింగ్ హాల్లోకి ఎలా అనుమతించారని ప్రశ్నించారు. ఫలితంపై అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందించలేదని ఆమె వాపోయారు. 7వ వార్డు ఫలితంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేసిన కాంగ్రెస్ నాయకులకు తగిన బుద్ధి చెప్పాలని ఆమె కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి