Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 07:16 AM

కాంగ్రెస్ నాయకుల కుట్రతోనే ఓటమి

కాంగ్రెస్ నాయకుల కుట్రతోనే ఓటమి

కాంగ్రెస్ నాయకుల కుట్రతోనే ఓటమి
18-02-2026 379 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

కానుగు యాదమ్మ బాలరాజు ఆరోపణ

7వ వార్డు భీఆర్ఎస్ అభ్యర్థి

భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) తరఫున చౌటుప్పల్ మున్సిపాలిటీ 7వ వార్డు నుంచి పోటీ చేసిన అభ్యర్థి కానుగు యాదమ్మ బాలరాజు తన ఓటమికి కాంగ్రెస్ నాయకుల కుట్రే కారణమని ఆరోపించారు. బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.7వ వార్డు ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మొదటగా ప్రకటించిన ఫలితాల్లో తనను విజేతగా ప్రకటించారని, అనంతరం రీకౌంటింగ్ నిర్వహించి కాంగ్రెస్ అభ్యర్థి గెలిచినట్లు వెల్లడించారని తెలిపారు.

అధికార పార్టీ నాయకులు రిటర్నింగ్ అధికారులతో కుమ్మక్కై బ్యాలెట్ పేపర్లను తారుమారు చేశారని ఆరోపించారు. తనకు వచ్చిన ఓట్లను కాంగ్రెస్ అభ్యర్థికి మళ్లించారని పేర్కొన్నారు. మున్సిపాలిటీకి సంబంధంలేని కాంగ్రెస్ నాయకులను కౌంటింగ్ హాల్‌లోకి ఎలా అనుమతించారని ప్రశ్నించారు. ఫలితంపై అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందించలేదని ఆమె వాపోయారు. 7వ వార్డు ఫలితంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేసిన కాంగ్రెస్ నాయకులకు తగిన బుద్ధి చెప్పాలని ఆమె కోరారు.

Sthanikam

కాంగ్రెస్ నాయకుల కుట్రతోనే ఓటమి

Article Image

కానుగు యాదమ్మ బాలరాజు ఆరోపణ

7వ వార్డు భీఆర్ఎస్ అభ్యర్థి

భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) తరఫున చౌటుప్పల్ మున్సిపాలిటీ 7వ వార్డు నుంచి పోటీ చేసిన అభ్యర్థి కానుగు యాదమ్మ బాలరాజు తన ఓటమికి కాంగ్రెస్ నాయకుల కుట్రే కారణమని ఆరోపించారు. బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.7వ వార్డు ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మొదటగా ప్రకటించిన ఫలితాల్లో తనను విజేతగా ప్రకటించారని, అనంతరం రీకౌంటింగ్ నిర్వహించి కాంగ్రెస్ అభ్యర్థి గెలిచినట్లు వెల్లడించారని తెలిపారు.

అధికార పార్టీ నాయకులు రిటర్నింగ్ అధికారులతో కుమ్మక్కై బ్యాలెట్ పేపర్లను తారుమారు చేశారని ఆరోపించారు. తనకు వచ్చిన ఓట్లను కాంగ్రెస్ అభ్యర్థికి మళ్లించారని పేర్కొన్నారు. మున్సిపాలిటీకి సంబంధంలేని కాంగ్రెస్ నాయకులను కౌంటింగ్ హాల్‌లోకి ఎలా అనుమతించారని ప్రశ్నించారు. ఫలితంపై అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందించలేదని ఆమె వాపోయారు. 7వ వార్డు ఫలితంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేసిన కాంగ్రెస్ నాయకులకు తగిన బుద్ధి చెప్పాలని ఆమె కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News