Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సర్ (ఎస్‌ఐఆర్) నమోదు ప్రక్రియను పరిశీలించిన తహశీల్దార్ మనోజ్ కుమార్ రెడ్డి తెలంగాణ పోలీసు క్రీడల్లో మూడు విభాగాల్లో కాంస్య పతకాలు సాధించి నల్లగొండ ఖ్యాతిని నిలబెట్టిన షకీర్ మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 01:23 PM

కాంగ్రెస్ మాయ హామీలకు ప్రజలు విసుగు. చిట్యాలలో బిఆర్ఎస్‌దే అభివృద్ధి ముద్ర – చిరుమర్తి లింగయ్య

కాంగ్రెస్ మాయ హామీలకు ప్రజలు విసుగు. చిట్యాలలో బిఆర్ఎస్‌దే అభివృద్ధి ముద్ర – చిరుమర్తి లింగయ్య

కాంగ్రెస్ మాయ హామీలకు ప్రజలు విసుగు. చిట్యాలలో బిఆర్ఎస్‌దే అభివృద్ధి ముద్ర – చిరుమర్తి లింగయ్య
February 09, 2026 08:40 PM 114 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చిట్యాల మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ మాయమాటలు, అమలుకాని హామీలపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వెల్లువెత్తుతోందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య స్పష్టం చేశారు. కేసీఆర్ నాయకత్వంలో జరిగిన అభివృద్ధే చిట్యాల ప్రజలకు స్పష్టంగా కనిపిస్తున్న నిజమని, అదే కారణంగా బిఆర్ఎస్ పార్టీపై ప్రజల్లో విశేష ఆదరణ పెరుగుతోందన్నారు.కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు, ఆరు గ్యారంటీలు ఎక్కడ అమలయ్యాయో చెప్పాలని స్థానిక ఎమ్మెల్యేను ప్రశ్నిస్తే సమాధానం లేక మౌనం వహిస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. ప్రజలను మభ్యపెట్టే రాజకీయాలకు ఇక రోజులు చెల్లిపోయాయని స్పష్టం చేశారు.కేసీఆర్ హయాంలో చిట్యాల మున్సిపాలిటీకి రూ.45 కోట్లకు పైగా నిధులు మంజూరు చేసి అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని గుర్తు చేశారు. అమృత్ పథకం కింద రూ.12 కోట్ల యాభై లక్షల నిధులు తాము మంజూరు చేస్తే, వాటిని తమ ఖాతాలో వేసుకుంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రజలను మోసం చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.రెండేళ్ల పాలనలో కొత్తగా ఒక్క రూపాయి తెచ్చే సత్తా లేక, బిఆర్ఎస్ తెచ్చిన నిధులకు శంకుస్థాపనలు చేయడమే కాంగ్రెస్ ఎమ్మెల్యే పనిగా మారిందని ఎద్దేవా చేశారు. అభివృద్ధి గురించి మాట్లాడలేక వ్యక్తిగత దూషణలకు దిగడం కాంగ్రెస్ రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనమన్నారు.

ఎన్నికలు సమీపిస్తేనే పథకాల పేరుతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని, అయితే చిట్యాల ప్రజలు ఇప్పటికే నిజం తెలుసుకున్నారని చెప్పారు. కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధే బిఆర్ఎస్ అసలైన గుర్తింపని, అదే నమ్మకంతో బిఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News