కాంగ్రెస్ మాయ హామీలకు ప్రజలు విసుగు. చిట్యాలలో బిఆర్ఎస్దే అభివృద్ధి ముద్ర – చిరుమర్తి లింగయ్య
కాంగ్రెస్ మాయ హామీలకు ప్రజలు విసుగు. చిట్యాలలో బిఆర్ఎస్దే అభివృద్ధి ముద్ర – చిరుమర్తి లింగయ్య
స్థానికం బృందం
చిట్యాల మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ మాయమాటలు, అమలుకాని హామీలపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వెల్లువెత్తుతోందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య స్పష్టం చేశారు. కేసీఆర్ నాయకత్వంలో జరిగిన అభివృద్ధే చిట్యాల ప్రజలకు స్పష్టంగా కనిపిస్తున్న నిజమని, అదే కారణంగా బిఆర్ఎస్ పార్టీపై ప్రజల్లో విశేష ఆదరణ పెరుగుతోందన్నారు.కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు, ఆరు గ్యారంటీలు ఎక్కడ అమలయ్యాయో చెప్పాలని స్థానిక ఎమ్మెల్యేను ప్రశ్నిస్తే సమాధానం లేక మౌనం వహిస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. ప్రజలను మభ్యపెట్టే రాజకీయాలకు ఇక రోజులు చెల్లిపోయాయని స్పష్టం చేశారు.కేసీఆర్ హయాంలో చిట్యాల మున్సిపాలిటీకి రూ.45 కోట్లకు పైగా నిధులు మంజూరు చేసి అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని గుర్తు చేశారు. అమృత్ పథకం కింద రూ.12 కోట్ల యాభై లక్షల నిధులు తాము మంజూరు చేస్తే, వాటిని తమ ఖాతాలో వేసుకుంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రజలను మోసం చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.రెండేళ్ల పాలనలో కొత్తగా ఒక్క రూపాయి తెచ్చే సత్తా లేక, బిఆర్ఎస్ తెచ్చిన నిధులకు శంకుస్థాపనలు చేయడమే కాంగ్రెస్ ఎమ్మెల్యే పనిగా మారిందని ఎద్దేవా చేశారు. అభివృద్ధి గురించి మాట్లాడలేక వ్యక్తిగత దూషణలకు దిగడం కాంగ్రెస్ రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనమన్నారు.
ఎన్నికలు సమీపిస్తేనే పథకాల పేరుతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని, అయితే చిట్యాల ప్రజలు ఇప్పటికే నిజం తెలుసుకున్నారని చెప్పారు. కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధే బిఆర్ఎస్ అసలైన గుర్తింపని, అదే నమ్మకంతో బిఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి