Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలంగాణలో ఉద్యోగాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. డివైఎఫ్ఐ. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 12:09 PM

కాంగ్రెస్ మాయ హామీలకు ప్రజలు విసుగు. చిట్యాలలో బిఆర్ఎస్‌దే అభివృద్ధి ముద్ర – చిరుమర్తి లింగయ్య

కాంగ్రెస్ మాయ హామీలకు ప్రజలు విసుగు. చిట్యాలలో బిఆర్ఎస్‌దే అభివృద్ధి ముద్ర – చిరుమర్తి లింగయ్య

కాంగ్రెస్ మాయ హామీలకు ప్రజలు విసుగు. చిట్యాలలో బిఆర్ఎస్‌దే అభివృద్ధి ముద్ర – చిరుమర్తి లింగయ్య
February 09, 2026 08:40 PM 109 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చిట్యాల మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ మాయమాటలు, అమలుకాని హామీలపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వెల్లువెత్తుతోందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య స్పష్టం చేశారు. కేసీఆర్ నాయకత్వంలో జరిగిన అభివృద్ధే చిట్యాల ప్రజలకు స్పష్టంగా కనిపిస్తున్న నిజమని, అదే కారణంగా బిఆర్ఎస్ పార్టీపై ప్రజల్లో విశేష ఆదరణ పెరుగుతోందన్నారు.కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు, ఆరు గ్యారంటీలు ఎక్కడ అమలయ్యాయో చెప్పాలని స్థానిక ఎమ్మెల్యేను ప్రశ్నిస్తే సమాధానం లేక మౌనం వహిస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. ప్రజలను మభ్యపెట్టే రాజకీయాలకు ఇక రోజులు చెల్లిపోయాయని స్పష్టం చేశారు.కేసీఆర్ హయాంలో చిట్యాల మున్సిపాలిటీకి రూ.45 కోట్లకు పైగా నిధులు మంజూరు చేసి అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని గుర్తు చేశారు. అమృత్ పథకం కింద రూ.12 కోట్ల యాభై లక్షల నిధులు తాము మంజూరు చేస్తే, వాటిని తమ ఖాతాలో వేసుకుంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రజలను మోసం చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.రెండేళ్ల పాలనలో కొత్తగా ఒక్క రూపాయి తెచ్చే సత్తా లేక, బిఆర్ఎస్ తెచ్చిన నిధులకు శంకుస్థాపనలు చేయడమే కాంగ్రెస్ ఎమ్మెల్యే పనిగా మారిందని ఎద్దేవా చేశారు. అభివృద్ధి గురించి మాట్లాడలేక వ్యక్తిగత దూషణలకు దిగడం కాంగ్రెస్ రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనమన్నారు.

ఎన్నికలు సమీపిస్తేనే పథకాల పేరుతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని, అయితే చిట్యాల ప్రజలు ఇప్పటికే నిజం తెలుసుకున్నారని చెప్పారు. కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధే బిఆర్ఎస్ అసలైన గుర్తింపని, అదే నమ్మకంతో బిఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News