కాంగ్రెస్ హామీలు వెంటనే అమలు చేయాలి ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం : ఎస్. వీరయ్య
కాంగ్రెస్ హామీలు వెంటనే అమలు చేయాలి ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం : ఎస్. వీరయ్య
Editor Desk
రామన్నపేట, : రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎస్. వీరయ్య డిమాండ్ చేశారు. స్థానిక పార్టీ కార్యాలయంలో కూరెళ్ల నరసింహాచారి అధ్యక్షతన నిర్వహించిన మండల కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలమైందన్నారు. గ్రామాల్లో ఉపాధి కూలీలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు, నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని పేర్కొన్నారు.
ఆరు గ్యారంటీల అమలులో ప్రభుత్వం వెనుకబడిందని, మహిళలకు రూ.2,500, ఉపాధి కూలీలకు రూ.1,200 ఇస్తామని చెప్పి ఇప్పటివరకు అమలు చేయలేదన్నారు. ఆసరా పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరులోనూ ఆలస్యం జరుగుతోందని విమర్శించారు.
ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు విడుదల కాకపోవడంతో పేద విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహా, జిల్లా నాయకులు మేక అశోక్ రెడ్డి, జల్లెల పెంటయ్య, బొడ్డుపల్లి వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి