Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 23, 2026 11:38 PM

కేటీఆర్‌ను శాలువాతో సత్కరించిన చిరుమర్తి లింగయ్య

కేటీఆర్‌ను శాలువాతో సత్కరించిన చిరుమర్తి లింగయ్య

కేటీఆర్‌ను శాలువాతో సత్కరించిన చిరుమర్తి లింగయ్య
December 18, 2025 07:42 PM 46 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం

యాదాద్రి భువనగిరిలో నూతన సర్పంచ్‌లకు సన్మానం

కేటీఆర్‌ను శాలువాతో సత్కరించిన చిరుమర్తి లింగయ్య

యాదాద్రి భువనగిరి, జిల్లా స్థానిక ప్రతినిధి

యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లకు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కేటీఆర్‌ను శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. గ్రామస్థాయి పాలనలో బీఆర్‌ఎస్ పార్టీ సాధించిన విజయాలకు ఇది నిదర్శనమని నేతలు పేర్కొన్నారు.

నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని కేటీఆర్ సూచించారు. పార్టీ నాయకత్వం ఎల్లప్పుడూ గ్రామ పాలకులకు అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News