Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:38 PM

కేటీఆర్‌ను శాలువాతో సత్కరించిన చిరుమర్తి లింగయ్య

కేటీఆర్‌ను శాలువాతో సత్కరించిన చిరుమర్తి లింగయ్య

కేటీఆర్‌ను శాలువాతో సత్కరించిన చిరుమర్తి లింగయ్య
December 18, 2025 07:42 PM 72 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరిలో నూతన సర్పంచ్‌లకు సన్మానం

కేటీఆర్‌ను శాలువాతో సత్కరించిన చిరుమర్తి లింగయ్య

యాదాద్రి భువనగిరి, జిల్లా స్థానిక ప్రతినిధి

యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లకు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కేటీఆర్‌ను శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. గ్రామస్థాయి పాలనలో బీఆర్‌ఎస్ పార్టీ సాధించిన విజయాలకు ఇది నిదర్శనమని నేతలు పేర్కొన్నారు.

నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని కేటీఆర్ సూచించారు. పార్టీ నాయకత్వం ఎల్లప్పుడూ గ్రామ పాలకులకు అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News