Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 07:50 AM

కేంద్ర కార్పొరేట్ విధానాలపై పోరాటం తప్పదు : NPRD నేతలు

కేంద్ర కార్పొరేట్ విధానాలపై పోరాటం తప్పదు : NPRD నేతలు

కేంద్ర కార్పొరేట్ విధానాలపై పోరాటం తప్పదు : NPRD నేతలు
January 04, 2026 04:34 PM 94 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రతినిధి

యాదాద్రి భువనగిరి, జిల్లా కేంద్రం:

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్పొరేట్, మతోన్మాద విధానాలను తిప్పికొట్టే వరకు పోరాటం కొనసాగుతుందని NPRD జిల్లా అధ్యక్ష–కార్యదర్శులు సురుపంగా ప్రకాష్, వనం ఉపేందర్ స్పష్టం చేశారు.

వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఆధ్వర్యంలో అంధుల అక్షర ప్రధాత లూయిస్ బ్రెయిలీ 217వ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే వీబీజీ–రామ్‌జీ బిల్లును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నరేగా చట్టబద్ధ హక్కును కుదించి గ్రామీణ ప్రజల జీవనోపాధిపై కేంద్రం దాడి చేస్తోందని విమర్శించారు.

కార్మికులకు వ్యతిరేకంగా లేబర్ కోడ్స్, శ్రమశక్తి నీతి–2025 అమలు చేస్తూ పెట్టుబడిదారులకే లాభం చేకూరుస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, విదేశీ పెట్టుబడులకు తలుపులు తెరవడం ప్రజల సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టడమేనని అన్నారు. మతం ఆధారిత పాలన రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు.

అలాగే తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల హామీగా ప్రకటించిన వికలాంగుల పెన్షన్ పెంపును అమలు చేయకుండా మోసం చేస్తోందని మండిపడ్డారు. వెంటనే పెన్షన్ పెంచకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్లెపల్లి స్వామి, కోశాధికారి కొత్త లలిత, బి.భగవంతు రెడ్డి, సంజీవ, శంకర్, నాగు, నరసింహ, హరిబాబు, చందు, గోపీ, మదన్ రావు తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News