ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వుల (G.O.Rt.No.606) ప్రకారం శ్రీసత్యసాయి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎమ్. మౌర్య భరద్వాజ్ మంగళవారం కదిరి పురపాలక సంఘం ప్రత్యేక అధికారిగా అదనపు బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, వీధిదీపాలు వంటి మౌలిక వసతులకు ఎలాంటి ఆటంకం కలగకుండా నిరంతరం పర్యవేక్షిస్తామని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కదిరి పట్టణాభివృద్ధి, పరిశుభ్రత కోసం ప్రజలందరూ మున్సిపల్ యంత్రాంగానికి సహకరించాలని ప్రత్యేక అధికారి కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి