PRINT TIME: February 24, 2026 03:01 AM
కడారి అంజయ్య మృతికి నివాళులు
కడారి అంజయ్య మృతికి నివాళులు
December 25, 2025 02:39 PM
209 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని నిదాన పల్లి గ్రామంలో కడారి అంజయ్య అనారోగ్యంతో మృతి చెందడంతో గ్రామంలో విషాదం అలుముకుంది.
ఈ సందర్భంగా అంజయ్య మృతదేహానికి గ్రామ సర్పంచ్ నారపాక మాధవి, యాదయ్య పూలమాలల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చి పరామర్శించారు.
కార్యక్రమంలో మాజీ సర్పంచులు గుత్తా నరసింహారెడ్డి, కొండ బుచ్చిబాబు, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు హాజరై కుటుంబానికి ధైర్యం చెప్పారు. అంజయ్య మృతి గ్రామానికి తీరని లోటని పలువురు పేర్కొన్నారు.
కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి