స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా అంజయ్య కుటుంబానికి సాయం
స్థానికం ప్రతినిధి రామన్నపేట
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని నిదానపల్లి గ్రామంలో నిన్న కడారి అంజయ్య అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.
అంజయ్య కుటుంబానికి చేయూతగా మందడి మల్లారెడ్డి వెంకటమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందించారు. మందడి ప్రభాకర్ రెడ్డి సహకారంతో రూ.5,000 నగదు సాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కొండా అండాలు మల్లయ్య, వార్డు సభ్యులు కడారి ఐలయ్య, ఏకుల మల్లేశం, సల్ల మల్లేష్, వర్కాల వినయ్ పాల్గొన్నారు. అలాగే గ్రామ పెద్దలు బొడిగె రంగయ్య, భీమగోని చంద్రయ్య, కడారి నరసింహ, గుండబోయిన గంగయ్య, భువనగిరి రమేష్, ఆగు లింగస్వామి తదితరులు హాజరయ్యారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి