కబడ్డీ క్రీడాకారిణి శ్రీజకు ఘన సన్మానం....
కబడ్డీ క్రీడాకారిణి శ్రీజకు ఘన సన్మానం....
Harish HS
కబడ్డీ క్రీడాకారిణి శ్రీజకు ఘన సన్మానం....
రాష్ట్ర జట్టులో జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొనడం గర్వకారణం....
కోదాడ పట్టణంలోని ఖేలో ఇండియా కబడ్డీ అకాడమీ క్రీడాకారిణి, కేఆర్ఆర్ కళాశాల విద్యార్థిని శ్రీజ హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన 72వ సీనియర్స్ మహిళా జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో తెలంగాణ రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించడం అభినందనీయం అని కళాశాల ప్రిన్సిపాల్ హడస రాణి, కబడ్డీ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి నామా నరసింహ రావులు అన్నారు.
బుధవారం కేఆర్ఆర్ కళాశాల ప్రాంగణంలో శ్రీజకు పుష్పగుచ్చాలు అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, క్రీడలలో ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎదగడం యువతకు ఆదర్శమని పేర్కొన్నారు. శ్రీజ మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఫిజికల్ డైరెక్టర్ ఫ్రాన్సిస్, అధ్యాపకులు అప్పారావు, ఇస్మాయిల్, సైదిరెడ్డి, యాదమ్మ పాల్గొని క్రీడాకారిణిని అభినందించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి