Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సూర్యాపేట మీదుగా బుల్లెట్‌ ట్రైన్‌ తేవాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 05:28 PM

కబడ్డీ క్రీడాకారిణి శ్రీజకు ఘన సన్మానం....

కబడ్డీ క్రీడాకారిణి శ్రీజకు ఘన సన్మానం....

కబడ్డీ క్రీడాకారిణి శ్రీజకు ఘన సన్మానం....
05-02-2026 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

కబడ్డీ క్రీడాకారిణి శ్రీజకు ఘన సన్మానం....

రాష్ట్ర జట్టులో జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొనడం గర్వకారణం....

కోదాడ పట్టణంలోని ఖేలో ఇండియా కబడ్డీ అకాడమీ క్రీడాకారిణి, కేఆర్ఆర్ కళాశాల విద్యార్థిని శ్రీజ హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన 72వ సీనియర్స్ మహిళా జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో తెలంగాణ రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించడం అభినందనీయం అని కళాశాల ప్రిన్సిపాల్ హడస రాణి, కబడ్డీ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి నామా నరసింహ రావులు అన్నారు.

బుధవారం కేఆర్ఆర్ కళాశాల ప్రాంగణంలో శ్రీజకు పుష్పగుచ్చాలు అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, క్రీడలలో ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎదగడం యువతకు ఆదర్శమని పేర్కొన్నారు. శ్రీజ మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో ఫిజికల్ డైరెక్టర్ ఫ్రాన్సిస్, అధ్యాపకులు అప్పారావు, ఇస్మాయిల్, సైదిరెడ్డి, యాదమ్మ పాల్గొని క్రీడాకారిణిని అభినందించారు.

Sthanikam

కబడ్డీ క్రీడాకారిణి శ్రీజకు ఘన సన్మానం....

Article Image

కబడ్డీ క్రీడాకారిణి శ్రీజకు ఘన సన్మానం....

రాష్ట్ర జట్టులో జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొనడం గర్వకారణం....

కోదాడ పట్టణంలోని ఖేలో ఇండియా కబడ్డీ అకాడమీ క్రీడాకారిణి, కేఆర్ఆర్ కళాశాల విద్యార్థిని శ్రీజ హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన 72వ సీనియర్స్ మహిళా జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో తెలంగాణ రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించడం అభినందనీయం అని కళాశాల ప్రిన్సిపాల్ హడస రాణి, కబడ్డీ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి నామా నరసింహ రావులు అన్నారు.

బుధవారం కేఆర్ఆర్ కళాశాల ప్రాంగణంలో శ్రీజకు పుష్పగుచ్చాలు అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, క్రీడలలో ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎదగడం యువతకు ఆదర్శమని పేర్కొన్నారు. శ్రీజ మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో ఫిజికల్ డైరెక్టర్ ఫ్రాన్సిస్, అధ్యాపకులు అప్పారావు, ఇస్మాయిల్, సైదిరెడ్డి, యాదమ్మ పాల్గొని క్రీడాకారిణిని అభినందించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News