కాంగ్రెస్ మద్దతుతో ఘన విజయం – మైనారిటీకి చారిత్రక అవకాశం
కాంగ్రెస్ మద్దతుతో ఘన విజయం – మైనారిటీకి చారిత్రక అవకాశం
స్థానికం బృందం
బోరంచ గ్రామ ఉపసర్పంచ్గా మొల్ల కరిమ్ ఎన్నిక
కాంగ్రెస్ మద్దతుతో ఘన విజయం – మైనారిటీకి చారిత్రక అవకాశం
నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి
నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలోని మానూర్ మండలం బోరంచ గ్రామంలో ఉపసర్పంచ్ ఎన్నిక రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రవ్యాప్తంగా బుధవారం జరిగిన మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో రెండు వార్డు మెంబర్గా పోటీ చేసిన మొల్ల కరిమ్ 89 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు.
ఈ నేపథ్యంలో గురువారం గ్రామ సర్పంచ్తో పాటు గెలుపొందిన వార్డు సభ్యుల సమక్షంలో జరిగిన సమావేశంలో మొల్ల కరిమ్ను ఏకగ్రీవంగా ఉపసర్పంచ్గా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికతో బోరంచ గ్రామంలో మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తి ఉపసర్పంచ్గా ఎంపిక కావడం ఇదే తొలిసారి కావడం విశేషం.
ఉపసర్పంచ్గా ఎన్నికైన అనంతరం మొల్ల కరిమ్ మాట్లాడుతూ… తనపై విశ్వాసం ఉంచి ఓటు వేసిన గ్రామ ప్రజలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా మైనారిటీ సోదరుల అండతో పాటు గ్రామంలోని అన్ని వర్గాల ప్రజల సహకారం వల్లే ఈ విజయం సాధ్యమైందన్నారు. బోరంచ గ్రామ అభివృద్ధి, సంక్షేమమే తన తొలి లక్ష్యమని పేర్కొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి