కాలనీవాసుల సమస్యలపై స్పందించిన కార్పొరేటర్ నవజీవన్ రెడ్డి
కాలనీవాసుల సమస్యలపై స్పందించిన కార్పొరేటర్ నవజీవన్ రెడ్డి
స్థానికం బృందం
కాలనీవాసుల సమస్యలపై స్పందించిన కార్పొరేటర్ నవజీవన్ రెడ్డి
స్థానికం ప్రతినిధి
హయత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి కాలనీవాసుల విజ్ఞప్తి మేరకు సిద్ధి వినాయక కాలనీలో పర్యటించారు. ఇటీవల నిర్మించిన సీసీ రోడ్ పనుల నాణ్యతను స్వయంగా పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా కాలనీలోని పలు వీధుల్లో భూగర్భ డ్రైనేజ్ పైప్లైన్ సదుపాయం లేకపోవడంతో ఎదురవుతున్న ఇబ్బందులను కాలనీవాసులు కార్పొరేటర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై వెంటనే స్పందించిన నవజీవన్ రెడ్డి, సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరితగతిన భూగర్భ డ్రైనేజ్ పైప్లైన్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
కాలనీలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని, ప్రజల సమస్యల పరిష్కారమే తన లక్ష్యమని కార్పొరేటర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు దుర్గాప్రసాద్, లక్ష్మారెడ్డి, లక్ష్మీనారాయణ, చరణ్, కనకారావు, లింగం, భాస్కర్, భీమరాజు, వేణుగోపాల్తో పాటు పలువురు కాలనీవాసులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి