జూకంటి జెన్నయ్య జ్ఞాపకార్థం బెంచీల ఏర్పాటు
జూకంటి జెన్నయ్య జ్ఞాపకార్థం బెంచీల ఏర్పాటు
Sthanikam District Staff Reporter
- ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా జూకంటి మధు సేవా కార్యక్రమం
మోటకొండూరు: మండల పరిధిలోని మాదిరే రాయకుంటపల్లి గ్రామంలో సేవా కార్యక్రమం నిర్వహించబడింది. గ్రామ పంచాయతీ 12వ వార్డు సభ్యులు,మోటకొండూరు మండల యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు జూకంటి మధు తన స్వంత నిధులతో గ్రామ ప్రజల కోసం బెంచీలను ఏర్పాటు చేశారు.
తన తండ్రి కీ.శే. జూకంటి జెన్నయ్య జ్ఞాపకార్థంగా రాయకుంటపల్లి, మోటకొండూరు గ్రామాలలో పలుచోట్ల బెంచీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా జూకంటి మధు మాట్లాడుతూ...బెంచీలు ముఖ్యంగా వృద్ధులు,వికలాంగులు,మహిళలు విశ్రాంతి తీసుకునేలా ఈ సదుపాయాలను కల్పించారు.“ప్రజల శ్రేయస్సే తన ఆశయ లక్ష్యం” అని పేర్కొంటూ, తన తండ్రి పేరు నిలబెట్టే విధంగా గ్రామ పంచాయతీ పాలక సభ్యుడిగా రావడం గర్వకారణమని గ్రామస్తులు అభినందించారు. కొడుకుగా తండ్రి పేరును నిలుపుతూ..సమాజ సేవలో ముందుండటం ఆదర్శనీయమని కొనియాడారు.12వ వార్డు సభ్యునిగా రాయకుంటపల్లి గ్రామ ప్రజానీకానికి,భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతానని జూకంటి మధు తెలిపారు. గ్రామాభివృద్ధి మరియు ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి