Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
Community Power for Health: Walkathon Sparks Preventive Care Movement సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 01:55 PM

జోగి రమేష్ ఇంటిపై దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలి:

జోగి రమేష్ ఇంటిపై దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలి:

జోగి రమేష్  ఇంటిపై దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలి:
February 03, 2026 09:03 PM 180 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY


ఎన్టీఆర్ జిల్లా, మైలవరం అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి, మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై టిడిపి దాడులు చేయడం చాలా హేయమైన చర్య అని రెడ్డిగూడెం వైస్ ఎంపీపీ చాట్ల రాబర్ట్ అన్నారు. రెడ్డిగూడెం మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కుప్పిరెడ్డి వెంకటరెడ్డి అధ్యక్షతన జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మైలవరం నియోజకవర్గ చరిత్రలో ఇలాంటి దాడులు ఇంతకుముందు ఎరిగి ఉండలేదని నేడు చూస్తే ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే విధంగా అధికార పార్టీ దాడులు చేయటం సరైంది కాదని అన్నారు. అధికారం ఎప్పుడు

శాశ్వతం కాదని నియోజకవర్గంలో ఇలాంటి పరిస్థితులు మరలా జరగకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే జోగి రమేష్ ఇంటిపై దాడులు చేసిన వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి కుప్పిరెడ్డి వరప్రసాద్ రెడ్డి , ఐటి వింగ్ జిల్లా జనరల్ సెక్రటరీ గుడిశె ప్రభాకర్ రెడ్డి , ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు మట్టకొయ్య రాము , రెడ్డిగూడెం గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడిమర్ల శ్రీనివాస రెడ్డి, గుంటక కులదీప్ రెడ్డి , ఎస్సీ సెల్ నాయకుడు మల్లాది బాబు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News