జోగి రమేష్ ఇంటిపై దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలి:
జోగి రమేష్ ఇంటిపై దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలి:
GADDAM JAGANMOHAN REDDY
ఎన్టీఆర్ జిల్లా, మైలవరం అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి, మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై టిడిపి దాడులు చేయడం చాలా హేయమైన చర్య అని రెడ్డిగూడెం వైస్ ఎంపీపీ చాట్ల రాబర్ట్ అన్నారు. రెడ్డిగూడెం మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కుప్పిరెడ్డి వెంకటరెడ్డి అధ్యక్షతన జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మైలవరం నియోజకవర్గ చరిత్రలో ఇలాంటి దాడులు ఇంతకుముందు ఎరిగి ఉండలేదని నేడు చూస్తే ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే విధంగా అధికార పార్టీ దాడులు చేయటం సరైంది కాదని అన్నారు. అధికారం ఎప్పుడు
శాశ్వతం కాదని నియోజకవర్గంలో ఇలాంటి పరిస్థితులు మరలా జరగకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే జోగి రమేష్ ఇంటిపై దాడులు చేసిన వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి కుప్పిరెడ్డి వరప్రసాద్ రెడ్డి , ఐటి వింగ్ జిల్లా జనరల్ సెక్రటరీ గుడిశె ప్రభాకర్ రెడ్డి , ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు మట్టకొయ్య రాము , రెడ్డిగూడెం గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడిమర్ల శ్రీనివాస రెడ్డి, గుంటక కులదీప్ రెడ్డి , ఎస్సీ సెల్ నాయకుడు మల్లాది బాబు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి