Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:00 PM

జోగి రమేష్ ఇంటిపై దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలి:

జోగి రమేష్ ఇంటిపై దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలి:

జోగి రమేష్  ఇంటిపై దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలి:
February 03, 2026 09:03 PM 191 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY


ఎన్టీఆర్ జిల్లా, మైలవరం అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి, మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై టిడిపి దాడులు చేయడం చాలా హేయమైన చర్య అని రెడ్డిగూడెం వైస్ ఎంపీపీ చాట్ల రాబర్ట్ అన్నారు. రెడ్డిగూడెం మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కుప్పిరెడ్డి వెంకటరెడ్డి అధ్యక్షతన జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మైలవరం నియోజకవర్గ చరిత్రలో ఇలాంటి దాడులు ఇంతకుముందు ఎరిగి ఉండలేదని నేడు చూస్తే ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే విధంగా అధికార పార్టీ దాడులు చేయటం సరైంది కాదని అన్నారు. అధికారం ఎప్పుడు

శాశ్వతం కాదని నియోజకవర్గంలో ఇలాంటి పరిస్థితులు మరలా జరగకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే జోగి రమేష్ ఇంటిపై దాడులు చేసిన వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి కుప్పిరెడ్డి వరప్రసాద్ రెడ్డి , ఐటి వింగ్ జిల్లా జనరల్ సెక్రటరీ గుడిశె ప్రభాకర్ రెడ్డి , ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు మట్టకొయ్య రాము , రెడ్డిగూడెం గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడిమర్ల శ్రీనివాస రెడ్డి, గుంటక కులదీప్ రెడ్డి , ఎస్సీ సెల్ నాయకుడు మల్లాది బాబు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News