Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 01:24 AM

జోగి రమేష్ ఇంటిపై దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలి:

జోగి రమేష్ ఇంటిపై దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలి:

జోగి రమేష్  ఇంటిపై దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలి:
February 03, 2026 09:03 PM 195 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY


ఎన్టీఆర్ జిల్లా, మైలవరం అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి, మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై టిడిపి దాడులు చేయడం చాలా హేయమైన చర్య అని రెడ్డిగూడెం వైస్ ఎంపీపీ చాట్ల రాబర్ట్ అన్నారు. రెడ్డిగూడెం మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కుప్పిరెడ్డి వెంకటరెడ్డి అధ్యక్షతన జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మైలవరం నియోజకవర్గ చరిత్రలో ఇలాంటి దాడులు ఇంతకుముందు ఎరిగి ఉండలేదని నేడు చూస్తే ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే విధంగా అధికార పార్టీ దాడులు చేయటం సరైంది కాదని అన్నారు. అధికారం ఎప్పుడు

శాశ్వతం కాదని నియోజకవర్గంలో ఇలాంటి పరిస్థితులు మరలా జరగకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే జోగి రమేష్ ఇంటిపై దాడులు చేసిన వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి కుప్పిరెడ్డి వరప్రసాద్ రెడ్డి , ఐటి వింగ్ జిల్లా జనరల్ సెక్రటరీ గుడిశె ప్రభాకర్ రెడ్డి , ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు మట్టకొయ్య రాము , రెడ్డిగూడెం గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడిమర్ల శ్రీనివాస రెడ్డి, గుంటక కులదీప్ రెడ్డి , ఎస్సీ సెల్ నాయకుడు మల్లాది బాబు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News