Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లక్ష్య సాధనకు పట్టుదల అవసరం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 03:22 PM

జంగారెడ్డిగూడెం లో వృద్ధురాలి మెడలో గొలుసు అపహరించిన ముద్దాయి అరెస్ట్

జంగారెడ్డిగూడెం లో వృద్ధురాలి మెడలో గొలుసు అపహరించిన ముద్దాయి అరెస్ట్

జంగారెడ్డిగూడెం లో వృద్ధురాలి మెడలో గొలుసు అపహరించిన ముద్దాయి అరెస్ట్
February 11, 2026 09:07 AM 39 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఒంటరిగా ఉన్న వృద్ధురాలిపై దాడి చేసి మెడలో బంగారు గొలుసు చోరీ చేసిన కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు జంగారెడ్డి గూడెం ఏఎస్పీ సుస్మిత రామనాథన్ తెలిపారు జంగారెడ్డిగూడెం పోలీస్స్టేషన్లో ఆమె మంగళవారం వివరాలు వెల్లడించారు కామవరపుకోట పాతూరు బీసీ కాలనీకి చెందిన వృద్ధురాలు కలకోటి వెంకట సత్యవతి ఒంటరిగా నివాసం ఉంటుంది ఈనెల ఏడవ తేదీ రాత్రి 9:00 సమయంలో ఆమె భోజనం చేస్తుండగా ఇంటి తలుపులు కొట్టిన శబ్దం విని తలుపు తీసింది ముఖానికి గుడ్డ కట్టుకొని ఉన్న గుర్తు తెలియని ఒక వ్యక్తి ఆమెపై దాడి చేసి రాడ్డుతో తలపై కొట్టి వృద్ధురాలి మెడలోని రెండు కాసుల బంగారు గొలుసు లాక్కొని పారిపోయాడు దీనిపై వృద్ధురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తడికలపూడి ఎస్సై టి చెన్నారావు కేసు నమోదు చేశారు సిఐఎంవి సుభాష్ ఆధ్వర్యంలో ఎస్సై విచారణ నిర్వహించి నిందితుడు కామవరపుకోట మండలం పాతూరు గ్రామానికి చెందిన అడవి కొట్టు వెంకటేశ్వరరావు అలియాస్ చక్రి అలియాస్ అంజిగా గుర్తించారు కామవరపు కోట చింతలపూడి వెళ్లే రోడ్డులో గ్రామ శివారు ఆర్ఆర్జికే డైరీ వద్ద నిందితుడిని అరెస్టు చేసి అతని వద్ద నుంచి ఒక లక్ష 40 వేల రూపాయలు విలువైన 14.600 గ్రాముల బంగారు గొలుసు నేరానికి ఉపయోగించిన మోటార్ సైకిల్ వృద్ధురాలిపై దాడికి వినియోగించిన దుస్తులు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు కేసును చేదించిన సీఐ ఎం.వి సుభాష్ ఎస్ఐ టి చెన్నారావు క్రైమ్ పార్టీ ఏఎస్ఐ ఎన్ వి సంపత్ కుమార్ పీసీలు ఎస్కే షాన్ ఎన్ రమేష్ ఏ సుధీర్ లను ఏఎస్పీ అభినందించారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News