Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 07:50 PM

జంమ్గీ (కె) లో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో పాల్గొన్న :సర్పంచ్ రియానా అమీన్ సాబ్

జంమ్గీ (కె) లో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో పాల్గొన్న :సర్పంచ్ రియానా అమీన్ సాబ్

జంమ్గీ (కె) లో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో పాల్గొన్న :సర్పంచ్ రియానా అమీన్ సాబ్
April 06, 2026 04:27 PM 30 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గం లోని కంగ్టి మండల పరిధిలోని జంమ్గీ కే గ్రామంలో ఘనంగా డాక్టర్ బాబు జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జంమ్గీ జాన్ మాదిగ మాట్లాడుతూ.. డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ ఆశయ సాధనలో కఠోరమైన పరిశ్రమికుడు. ఉన్నతమైన లక్ష్యాలు ఉన్న స్వాప్నికుడు. గనుకనే అతడు ఎన్నో రాజకీయ శిఖరాల్నీ అధిరోహించగలిగాడు. ఆనాడు దేశ రాజకీయాల్లో ఉద్దండులు అనబడు వారు సైతం ఆయన మాటను పాఠంగా ఒప్పుకునేంత ఉన్నత వ్యక్తిత్వం ఆయన సొంతం అని తెలియజేశారు,ఐదు దశాబ్దాల కాలంపాటు రాజకీయాల్లో ఓటమెరుగని ప్రజానేతగా కొనసాగడంమంటే మామూలు విషయం కాదు. భారత రిపబ్లిక్ తొలి లోక్సభ(1952)లో ప్రవేశించిన డా.బాబూ జగ్జీవన్ రామ్ వరుసగా ఎనిమిదిసార్లు గెలిచాడు. ముప్ఫైమూడు సంవత్సరాలు కేంద్ర కేబినెట్ మంత్రిగా, ఉప ప్రధానమంత్రిగా భారతదేశ సమగ్ర అభివృద్ధికి విశిష్ట సేవలందించిన రాజకీయ దురంధరుడు మరొకరు ఈనాటికీ లేరు. మొదటి శ్రేణి పార్లమెంటేరియన్గా నిలిచాడు. ఏ శాఖామంత్రిగా ఉన్న ఆ శాఖకు వన్నె తెచ్చిన నేత. డా. బాబూ జగ్జీవన్ రామ్ నేతృత్వం వహించిన శాఖల్లో ఆయన తీసుకువచ్చిన సంస్కరణలు ఈనాటికీ ఆమోదయోగ్యమైనవిగా మనుగడలో ఉండడం ఆయన దూరదృష్టికి తార్కాణాలు. దేశం క్లిష్ట పరిస్థితుల్నీ ఎదుర్కొంటున్న ప్రతీసారి ఆయన పనితనం ప్రపంచం ప్రశంసించే స్థాయిలో ఆయన్ను నిలబెట్టిందని జంమ్గీ జాన్ మాదిగ ఉపన్యాసించారు.ఈ కార్యక్రమంలో అంజయ్య, పి రాజి పటేల్ , ఎమ్మార్పీఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు డేవిడ్ మాదిగ, బోర్గీ రాములు, పెంటయ్య, నాగయ్య, రాములు, భూమయ్య, దేవదాస్, ఎమ్మార్పీఎస్ నాయకులు గ్రామ పెద్దలు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News