Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిట్యాల మండలానికి కొత్త తహసీల్దార్ బాధ్యతలు స్వీకరణ గుడిపల్లిలో ఆధ్యాత్మిక వైభవం… 101వ బ్రహ్మోత్సవాల్లో ఘనంగా శయనోత్సవం జురెల్ జుంఝుమారుతం.. గుజరాత్ కోటలో రాయల్స్ జైత్రయాత్ర! “అడవిని కాపాడే ‘అమ్మ’: జార్ఖండ్ ‘లేడీ టార్జాన్’ చామీ ముర్ము 30 లక్షల చెట్ల గాథ” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” పెనుకొండలో శశి భూషణ్ పటేల్ జన్మదిన వేడుకలు – కేక్ కట్, మొక్క నాటిన టీడీపీ నేతలు సింగరేణి గనిలో దళిత కార్మికులపై అమానుషిక వివక్ష: వెయిటింగ్ రూమ్‌లో భోజనానికి అడ్డుకున్న అధికారులు! “పరిశోధనలతోనే ఉన్నత విద్యకు నాణ్యత: అకాడమిక్ కౌన్సిల్‌లో చర్చ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 06, 2026 06:21 PM

జంమ్గీ (కె) లో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో పాల్గొన్న :సర్పంచ్ రియానా అమీన్ సాబ్

జంమ్గీ (కె) లో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో పాల్గొన్న :సర్పంచ్ రియానా అమీన్ సాబ్

జంమ్గీ (కె) లో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో పాల్గొన్న :సర్పంచ్ రియానా అమీన్ సాబ్
April 06, 2026 04:27 PM 8 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గం లోని కంగ్టి మండల పరిధిలోని జంమ్గీ కే గ్రామంలో ఘనంగా డాక్టర్ బాబు జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జంమ్గీ జాన్ మాదిగ మాట్లాడుతూ.. డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ ఆశయ సాధనలో కఠోరమైన పరిశ్రమికుడు. ఉన్నతమైన లక్ష్యాలు ఉన్న స్వాప్నికుడు. గనుకనే అతడు ఎన్నో రాజకీయ శిఖరాల్నీ అధిరోహించగలిగాడు. ఆనాడు దేశ రాజకీయాల్లో ఉద్దండులు అనబడు వారు సైతం ఆయన మాటను పాఠంగా ఒప్పుకునేంత ఉన్నత వ్యక్తిత్వం ఆయన సొంతం అని తెలియజేశారు,ఐదు దశాబ్దాల కాలంపాటు రాజకీయాల్లో ఓటమెరుగని ప్రజానేతగా కొనసాగడంమంటే మామూలు విషయం కాదు. భారత రిపబ్లిక్ తొలి లోక్సభ(1952)లో ప్రవేశించిన డా.బాబూ జగ్జీవన్ రామ్ వరుసగా ఎనిమిదిసార్లు గెలిచాడు. ముప్ఫైమూడు సంవత్సరాలు కేంద్ర కేబినెట్ మంత్రిగా, ఉప ప్రధానమంత్రిగా భారతదేశ సమగ్ర అభివృద్ధికి విశిష్ట సేవలందించిన రాజకీయ దురంధరుడు మరొకరు ఈనాటికీ లేరు. మొదటి శ్రేణి పార్లమెంటేరియన్గా నిలిచాడు. ఏ శాఖామంత్రిగా ఉన్న ఆ శాఖకు వన్నె తెచ్చిన నేత. డా. బాబూ జగ్జీవన్ రామ్ నేతృత్వం వహించిన శాఖల్లో ఆయన తీసుకువచ్చిన సంస్కరణలు ఈనాటికీ ఆమోదయోగ్యమైనవిగా మనుగడలో ఉండడం ఆయన దూరదృష్టికి తార్కాణాలు. దేశం క్లిష్ట పరిస్థితుల్నీ ఎదుర్కొంటున్న ప్రతీసారి ఆయన పనితనం ప్రపంచం ప్రశంసించే స్థాయిలో ఆయన్ను నిలబెట్టిందని జంమ్గీ జాన్ మాదిగ ఉపన్యాసించారు.ఈ కార్యక్రమంలో అంజయ్య, పి రాజి పటేల్ , ఎమ్మార్పీఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు డేవిడ్ మాదిగ, బోర్గీ రాములు, పెంటయ్య, నాగయ్య, రాములు, భూమయ్య, దేవదాస్, ఎమ్మార్పీఎస్ నాయకులు గ్రామ పెద్దలు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News