జిట్టాబాల కృష్ణారెడ్డి జ్ఞాపకార్థం హన్మపురంలో క్రీడ పోటీలు
జిట్టాబాల కృష్ణారెడ్డి జ్ఞాపకార్థం హన్మపురంలో క్రీడ పోటీలు
Sthanikam District Staff Reporter
వాలీబాల్, కబడ్డీ విజేతలకు షీల్డ్, నగదు బహుమతులు అందజేత...
తెలంగాణ సాధన మలిదశ ఉద్యమకారుడు,స్వామి వివేకానంద యువజన సంఘాల అధ్యక్షులు స్వర్గీయ జిట్టా బాల కృష్ణారెడ్డి జ్ఞాపకార్ధం భువనగిరి మండలంలోని హన్మపురం గ్రామంలో రాష్ట్రస్థాయి క్రీడా పోటీలను ఆయన అభిమాని నాగపురి యాదగిరి ఆధ్వర్యంలో పోటీలను నిర్వహించారు. వాలీబాల్ కబడ్డీ పోటీలకు గాను యాదాద్రి భువనగిరి జిల్లా వివిధ జిల్లాల నుండి పోటీ చేసే సుమారు 24 జట్లు పాల్గొన్నాయి. గత మూడు రోజులుగా క్రీడా పోటీల్లో పాల్గొన్న విజేతలకు ప్రథమ ద్వితీయ శ్రేణి సాధించిన
క్రీడాకారులకు షీల్డ్ నగదు పారితోషితం సీనియర్ జర్నలిస్టు సొల్లేటి గోవర్ధన చారి చేతుల మీదుగా అందజేశారు.
న్యాయ నిర్ణయేతలుగా పిఈటిలు రాము హరి గౌడ్ వ్యవహరించారు. ఈ
సందర్భంగా నిర్వాహకులు నాగపురి యాదగిరి మాట్లాడుతూ... క్రీడా పోటీలకు పాల్గొన్న క్రీడాకారులకు వారు అభినందించారు. స్వర్గీయ జిట్టా బాల కృష్ణారెడ్డి ఎప్పుడు క్రీడల పట్ల ఆసక్తి చూపేవారని వారి ఆశయ సాధనకు క్రీడా పోటీలు నిర్వహించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో క్రీడాకారులు విద్యార్థిని విద్యార్థులు యువకులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి