జిల్లా ప్రజలకు పండుగ శుభాకాంక్షలు
జిల్లా ప్రజలకు పండుగ శుభాకాంక్షలు
Biksham
సంతోషం, శాంతి, సమృద్ధి కలగాలి– ముత్యాలసైదులు
సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం
భోగి, సంక్రాంతి, కనుమ పండుగల సందర్భంగా సూర్యాపేట జిల్లా ప్రజలందరికీ ముత్యాలసైదులు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగు ప్రజల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలైన ఈ పండుగలు ప్రతి ఇంటికి సుఖసంతోషాలు, శాంతి, సమృద్ధి తీసుకురావాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో కలిసి పండుగలను ఆనందంగా జరుపుకోవాలని కోరారు. భోగి పండుగ ద్వారా పాత బాధలు, కష్టాలను విడిచిపెట్టి కొత్త ఆశలతో, సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలని, సంక్రాంతి పండుగ రైతులకు, ప్రజలకు మంచి పంటలు, శ్రేయస్సు అందించాలని, కనుమ పండుగ పశుసంపద అభివృద్ధికి దోహదపడాలని ఆయన తెలిపారు. సూర్యాపేట జిల్లా ప్రజలందరూ ఐక్యతతో, సోదరభావంతో పండుగలను జరుపుకుని, కొత్త సంవత్సరంలో మంచి ఫలితాలు సాధించాలని కోరుతూ మరోసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి