PRINT TIME: April 05, 2026 01:53 AM
జీతాలు ఇవ్వకపోతే నీటి సరఫరా నిలిపివేత – కార్మికుల హెచ్చరిక
జీతాలు ఇవ్వకపోతే నీటి సరఫరా నిలిపివేత – కార్మికుల హెచ్చరిక
April 04, 2026 08:52 PM
73 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
నారాయణఖేడ్ తాలూకాలోని వివిధ మండలానికి చెందిన మిషన్ భగీరథ కార్మికులు తమ పెండింగ్ జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. మానూర్ మండలం బోరంచ గ్రామంలోని వాటర్ ప్లాంట్ వద్ద శనివారం వారు సమ్మెకు దిగారు.గత ఆరు నెలలుగా జీతాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కార్మికులు తెలిపారు.పెండింగ్లో ఉన్న జీతాలను వెంటనే చెల్లించాలని,తమ సమస్యను పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు తక్షణమే స్పందించాలని వారు కోరారు.జీతాలు అందకపోవడంతో కుటుంబాలను పోషించుకోవడం కష్టమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సమస్యపై అధికారులు స్పందించకపోవడంతో, తమ నిరసనను మరింత తీవ్రతరం చేస్తూ వాటర్ ప్లాంట్ నుండి మూడు రోజులుగా నీటి సరఫరాను నిలిపివేసినట్లు కార్మికులు పేర్కొన్నారు. సమస్య త్వరగా పరిష్కరించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి