Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 07:44 PM

జీతాలు ఇవ్వకపోతే నీటి సరఫరా నిలిపివేత – కార్మికుల హెచ్చరిక

జీతాలు ఇవ్వకపోతే నీటి సరఫరా నిలిపివేత – కార్మికుల హెచ్చరిక

జీతాలు ఇవ్వకపోతే నీటి సరఫరా నిలిపివేత – కార్మికుల హెచ్చరిక
April 04, 2026 08:52 PM 174 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ తాలూకాలోని వివిధ మండలానికి చెందిన మిషన్ భగీరథ కార్మికులు తమ పెండింగ్ జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. మానూర్ మండలం బోరంచ గ్రామంలోని వాటర్ ప్లాంట్ వద్ద శనివారం వారు సమ్మెకు దిగారు.గత ఆరు నెలలుగా జీతాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కార్మికులు తెలిపారు.పెండింగ్‌లో ఉన్న జీతాలను వెంటనే చెల్లించాలని,తమ సమస్యను పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు తక్షణమే స్పందించాలని వారు కోరారు.జీతాలు అందకపోవడంతో కుటుంబాలను పోషించుకోవడం కష్టమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సమస్యపై అధికారులు స్పందించకపోవడంతో, తమ నిరసనను మరింత తీవ్రతరం చేస్తూ వాటర్ ప్లాంట్ నుండి మూడు రోజులుగా నీటి సరఫరాను నిలిపివేసినట్లు కార్మికులు పేర్కొన్నారు. సమస్య త్వరగా పరిష్కరించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News