Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 04:02 AM

జీతాలు ఇవ్వకపోతే నీటి సరఫరా నిలిపివేత – కార్మికుల హెచ్చరిక

జీతాలు ఇవ్వకపోతే నీటి సరఫరా నిలిపివేత – కార్మికుల హెచ్చరిక

జీతాలు ఇవ్వకపోతే నీటి సరఫరా నిలిపివేత – కార్మికుల హెచ్చరిక
April 04, 2026 08:52 PM 178 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ తాలూకాలోని వివిధ మండలానికి చెందిన మిషన్ భగీరథ కార్మికులు తమ పెండింగ్ జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. మానూర్ మండలం బోరంచ గ్రామంలోని వాటర్ ప్లాంట్ వద్ద శనివారం వారు సమ్మెకు దిగారు.గత ఆరు నెలలుగా జీతాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కార్మికులు తెలిపారు.పెండింగ్‌లో ఉన్న జీతాలను వెంటనే చెల్లించాలని,తమ సమస్యను పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు తక్షణమే స్పందించాలని వారు కోరారు.జీతాలు అందకపోవడంతో కుటుంబాలను పోషించుకోవడం కష్టమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సమస్యపై అధికారులు స్పందించకపోవడంతో, తమ నిరసనను మరింత తీవ్రతరం చేస్తూ వాటర్ ప్లాంట్ నుండి మూడు రోజులుగా నీటి సరఫరాను నిలిపివేసినట్లు కార్మికులు పేర్కొన్నారు. సమస్య త్వరగా పరిష్కరించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News