నగరంలో ఆహార ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటున్న డార్క్ స్టోన్ ఐస్క్రీమ్ తన 5వ బ్రాంచ్ను హస్తినాపురం బీ ఎన్ రెడ్డి నగర్ జెడ్పీ రోడ్లో ఘనంగా ప్రారంభించింది. నూతన బ్రాంచ్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది.
ఈ సందర్భంగా నిర్వాహకులు ప్రియాంక రెడ్డి, శృతి మాట్లాడుతూ వినియోగదారులకు నాణ్యమైన రుచులతో పాటు ప్రత్యేకమైన ఐస్క్రీమ్ వేరైటీలను అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. కుటుంబ సమేతంగా వచ్చి ఆనందంగా గడిపే విధంగా బ్రాంచ్ను తీర్చిదిద్దామని పేర్కొన్నారు.ప్రారంభోత్సవ కార్యక్రమంలో శ్రీకాంత్తో పాటు పలువురు అతిథులు, స్థానికులు పాల్గొని నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. నూతన బ్రాంచ్ ప్రారంభంతో స్థానిక ప్రజలకు మరిన్ని రుచులు అందుబాటులోకి వచ్చాయని ఆనందం వ్యక్తం చేశారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి