జాతీయ లోక్ అదాలత్తో వేగవంతమైన న్యాయం – ప్రజలకు ఎస్పీ పిలుపు
జాతీయ లోక్ అదాలత్తో వేగవంతమైన న్యాయం – ప్రజలకు ఎస్పీ పిలుపు
Krishna
ఈ నెల 28వ తేదీన నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ శ్రీ పరితోష్ పంకజ్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అనుకోకుండా లేదా క్షణికావేశంలో జరిగిన వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్ ఒక మంచి అవకాశమని పేర్కొన్నారు.జిల్లా వ్యాప్తంగా చాలా కాలంగా పెండింగ్లో ఉన్న, రాజీ కుదుర్చుకునే అవకాశం ఉన్న కేసులను పరస్పర అవగాహనతో త్వరితగతిన పరిష్కరించుకోవచ్చని తెలిపారు.కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలో సమస్యలకు పరిష్కారం పొందే అవకాశం లోక్ అదాలత్ ద్వారా లభిస్తుందని అన్నారు. ప్రజలు అనవసర వివాదాలకు దూరంగా ఉండి, తమ జీవితాలను సుఖశాంతులతో ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.రాజీ పడదగిన కేసులు:
క్రిమినల్ కంపౌండబుల్ కేసులు, సివిల్ వివాదాలు, ఆస్తి పంపకాలు, కుటుంబ మరియు వైవాహిక సమస్యలు,బ్యాంకు రికవరీ కేసులు, విద్యుత్ చౌర్యం, చెక్ బౌన్స్ కేసులు వంటి అనేక కేసుల్లో ఇరువర్గాల పరస్పర సమ్మతితో రాజీ కుదుర్చుకోవచ్చు.సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి:
సైబర్ నేరాల బాధితులు కోల్పోయిన డబ్బులను తిరిగి పొందేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులకు ఎస్పీ సూచించారు. ముఖ్యంగా రూ.25,000/- లోపు నష్టం జరిగిన కేసుల్లో, లోక్ అదాలత్ ద్వారా ఫిర్యాదు చేసి, కోర్టు అనుమతితో ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండానే రీఫండ్ ప్రక్రియ పూర్తి చేసుకునే అవకాశం ఉందని తెలిపారు.జాతీయ లోక్ అదాలత్ విజయవంతం కావడానికి జిల్లా స్థాయి అధికారులు నుండి కానిస్టేబుల్ స్థాయి వరకు అందరూ సమన్వయంతో పనిచేయాలని ఎస్పీ ఆదేశించారు.రాజీ పడదగిన కేసుల్లో ఇరువర్గాలకు కౌన్సిలింగ్ నిర్వహించి, ఎక్కువ సంఖ్యలో కేసులను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.లోక్ అదాలత్ ద్వారా వేగవంతమైన, సులభమైన,న్యాయబద్ధమైన పరిష్కారం లభిస్తుందని ప్రజల్లో అవగాహన పెంచాలని, ఈ నెల 28న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ను ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ పిలుపునిచ్చారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి