జాతీయ లోక్ అదాలత్ విజయవంతానికి పోలీసుల సహకారం అవసరం
జాతీయ లోక్ అదాలత్ విజయవంతానికి పోలీసుల సహకారం అవసరం
K.RAVI
పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి – కార్యదర్శి వి. మాధవి లత
జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ యాదాద్రి భువనగిరి అధ్యక్షులు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ. జయరాజు సూచనల మేరకు సంస్థ కార్యదర్శి వి. మాధవి లత చౌటుప్పల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టును సందర్శించారు. ఈ సందర్భంగా చౌటుప్పల్ కోర్టు హాలులో పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 28వ తేదీ శనివారం నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్లో అధిక సంఖ్యలో కేసులను పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. చౌటుప్పల్ కోర్టు పరిధిలో ఎక్కువ కేసులు పెండింగ్లో ఉన్నందున రాజీ పడదగిన కేసులను ఎక్కువగా పరిష్కరించేలా పోలీసు అధికారులు పూర్తి సహకారం అందించాలని కోరారు.దీనికోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి రాజీకి అనుకూలమైన కేసుల్లో లోక్ అదాలత్ నోటీసులు అందజేయాలని సూచించారు. ప్రీ-సిట్టింగ్స్ ద్వారా ఇరుపక్షాల మధ్య రాజీ కుదిరే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. లోక్ అదాలత్పై కోర్టు పరిధిలోని ప్రతి గ్రామానికి సమాచారం చేరేలా విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. లోక్ అదాలత్ నిర్వహణను జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ. జయరాజు నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన సూచనలు అందిస్తున్నారని తెలిపారు. ఈ లోక్ అదాలత్ ద్వారా పెండింగ్ కేసులు తగ్గడమే కాకుండా సమాజంలో స్నేహపూర్వక వాతావరణం నెలకొంటుందని పేర్కొన్నారు.మార్చి 28 వరకు ప్రతిరోజు కక్షిదారులు తమ కేసులను పరిష్కరించుకునేలా వెసులుబాటు ఉంటుందని తెలిపారు.ఈ సమావేశంలో చౌటుప్పల్ డీఎస్పీ మధుసూధన్ రెడ్డి, సీఐ మన్మధకుమార్, నారాయణపూర్ సీఐ రాములు, ఎక్సైజ్ సీఐ బాలోజీ నాయక్, ఎస్ఐలు, ట్రాఫిక్ పోలీసులు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి