Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 12:15 AM

జాతీయ లోక్ అదాలత్ విజయవంతానికి పోలీసుల సహకారం అవసరం

జాతీయ లోక్ అదాలత్ విజయవంతానికి పోలీసుల సహకారం అవసరం

జాతీయ లోక్ అదాలత్ విజయవంతానికి పోలీసుల సహకారం అవసరం
March 14, 2026 06:57 PM 263 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి – కార్యదర్శి వి. మాధవి లత

జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ యాదాద్రి భువనగిరి అధ్యక్షులు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ. జయరాజు సూచనల మేరకు సంస్థ కార్యదర్శి వి. మాధవి లత చౌటుప్పల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టును సందర్శించారు. ఈ సందర్భంగా చౌటుప్పల్ కోర్టు హాలులో పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 28వ తేదీ శనివారం నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌లో అధిక సంఖ్యలో కేసులను పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. చౌటుప్పల్ కోర్టు పరిధిలో ఎక్కువ కేసులు పెండింగ్‌లో ఉన్నందున రాజీ పడదగిన కేసులను ఎక్కువగా పరిష్కరించేలా పోలీసు అధికారులు పూర్తి సహకారం అందించాలని కోరారు.దీనికోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి రాజీకి అనుకూలమైన కేసుల్లో లోక్ అదాలత్ నోటీసులు అందజేయాలని సూచించారు. ప్రీ-సిట్టింగ్స్ ద్వారా ఇరుపక్షాల మధ్య రాజీ కుదిరే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. లోక్ అదాలత్‌పై కోర్టు పరిధిలోని ప్రతి గ్రామానికి సమాచారం చేరేలా విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. లోక్ అదాలత్ నిర్వహణను జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ. జయరాజు నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన సూచనలు అందిస్తున్నారని తెలిపారు. ఈ లోక్ అదాలత్ ద్వారా పెండింగ్ కేసులు తగ్గడమే కాకుండా సమాజంలో స్నేహపూర్వక వాతావరణం నెలకొంటుందని పేర్కొన్నారు.మార్చి 28 వరకు ప్రతిరోజు కక్షిదారులు తమ కేసులను పరిష్కరించుకునేలా వెసులుబాటు ఉంటుందని తెలిపారు.ఈ సమావేశంలో చౌటుప్పల్ డీఎస్పీ మధుసూధన్ రెడ్డి, సీఐ మన్మధకుమార్, నారాయణపూర్ సీఐ రాములు, ఎక్సైజ్ సీఐ బాలోజీ నాయక్, ఎస్‌ఐలు, ట్రాఫిక్ పోలీసులు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News