Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:15 AM

జాతీయ లోక్ అదాలత్ విజయవంతానికి పోలీసుల సహకారం అవసరం

జాతీయ లోక్ అదాలత్ విజయవంతానికి పోలీసుల సహకారం అవసరం

జాతీయ లోక్ అదాలత్ విజయవంతానికి పోలీసుల సహకారం అవసరం
14-03-2026 268 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి – కార్యదర్శి వి. మాధవి లత

జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ యాదాద్రి భువనగిరి అధ్యక్షులు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ. జయరాజు సూచనల మేరకు సంస్థ కార్యదర్శి వి. మాధవి లత చౌటుప్పల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టును సందర్శించారు. ఈ సందర్భంగా చౌటుప్పల్ కోర్టు హాలులో పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 28వ తేదీ శనివారం నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌లో అధిక సంఖ్యలో కేసులను పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. చౌటుప్పల్ కోర్టు పరిధిలో ఎక్కువ కేసులు పెండింగ్‌లో ఉన్నందున రాజీ పడదగిన కేసులను ఎక్కువగా పరిష్కరించేలా పోలీసు అధికారులు పూర్తి సహకారం అందించాలని కోరారు.దీనికోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి రాజీకి అనుకూలమైన కేసుల్లో లోక్ అదాలత్ నోటీసులు అందజేయాలని సూచించారు. ప్రీ-సిట్టింగ్స్ ద్వారా ఇరుపక్షాల మధ్య రాజీ కుదిరే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. లోక్ అదాలత్‌పై కోర్టు పరిధిలోని ప్రతి గ్రామానికి సమాచారం చేరేలా విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. లోక్ అదాలత్ నిర్వహణను జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ. జయరాజు నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన సూచనలు అందిస్తున్నారని తెలిపారు. ఈ లోక్ అదాలత్ ద్వారా పెండింగ్ కేసులు తగ్గడమే కాకుండా సమాజంలో స్నేహపూర్వక వాతావరణం నెలకొంటుందని పేర్కొన్నారు.మార్చి 28 వరకు ప్రతిరోజు కక్షిదారులు తమ కేసులను పరిష్కరించుకునేలా వెసులుబాటు ఉంటుందని తెలిపారు.ఈ సమావేశంలో చౌటుప్పల్ డీఎస్పీ మధుసూధన్ రెడ్డి, సీఐ మన్మధకుమార్, నారాయణపూర్ సీఐ రాములు, ఎక్సైజ్ సీఐ బాలోజీ నాయక్, ఎస్‌ఐలు, ట్రాఫిక్ పోలీసులు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.

Sthanikam

జాతీయ లోక్ అదాలత్ విజయవంతానికి పోలీసుల సహకారం అవసరం

Article Image

పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి – కార్యదర్శి వి. మాధవి లత

జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ యాదాద్రి భువనగిరి అధ్యక్షులు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ. జయరాజు సూచనల మేరకు సంస్థ కార్యదర్శి వి. మాధవి లత చౌటుప్పల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టును సందర్శించారు. ఈ సందర్భంగా చౌటుప్పల్ కోర్టు హాలులో పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 28వ తేదీ శనివారం నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌లో అధిక సంఖ్యలో కేసులను పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. చౌటుప్పల్ కోర్టు పరిధిలో ఎక్కువ కేసులు పెండింగ్‌లో ఉన్నందున రాజీ పడదగిన కేసులను ఎక్కువగా పరిష్కరించేలా పోలీసు అధికారులు పూర్తి సహకారం అందించాలని కోరారు.దీనికోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి రాజీకి అనుకూలమైన కేసుల్లో లోక్ అదాలత్ నోటీసులు అందజేయాలని సూచించారు. ప్రీ-సిట్టింగ్స్ ద్వారా ఇరుపక్షాల మధ్య రాజీ కుదిరే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. లోక్ అదాలత్‌పై కోర్టు పరిధిలోని ప్రతి గ్రామానికి సమాచారం చేరేలా విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. లోక్ అదాలత్ నిర్వహణను జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ. జయరాజు నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన సూచనలు అందిస్తున్నారని తెలిపారు. ఈ లోక్ అదాలత్ ద్వారా పెండింగ్ కేసులు తగ్గడమే కాకుండా సమాజంలో స్నేహపూర్వక వాతావరణం నెలకొంటుందని పేర్కొన్నారు.మార్చి 28 వరకు ప్రతిరోజు కక్షిదారులు తమ కేసులను పరిష్కరించుకునేలా వెసులుబాటు ఉంటుందని తెలిపారు.ఈ సమావేశంలో చౌటుప్పల్ డీఎస్పీ మధుసూధన్ రెడ్డి, సీఐ మన్మధకుమార్, నారాయణపూర్ సీఐ రాములు, ఎక్సైజ్ సీఐ బాలోజీ నాయక్, ఎస్‌ఐలు, ట్రాఫిక్ పోలీసులు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News