Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 23, 2026 08:39 PM

జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని యధావిదంగా కొనసాగించాలి సీపిఐ

జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని యధావిదంగా కొనసాగించాలి సీపిఐ

జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని యధావిదంగా కొనసాగించాలి సీపిఐ
February 10, 2026 06:29 AM 54 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని యధావిదంగా కొనసాగించాలని విబిజి రాంజీ పథకాన్ని రద్దు చేయాలని కోరుతూ ఏలూరు జిల్లా చాట్రాయి మండలం చిత్తపూరు గ్రామపంచాయతీ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ చాట్రాయి మండల కార్యదర్శి కలపాల వెంకటేశ్వరావు మాట్లాడుతూ గతంలో జాతీయ ఉపాధి హామీ చట్టంలో పని కావాలని చెప్పి అర్జీ పెట్టుకుంటే 15 రోజుల్లో పని కల్పించే అవకాశం ఉండేదని, నిరుద్యోగ భృతి చెల్లించే అవకాశం ఉండేదని, మరి ఇన్సూరెన్స్ ఇచ్చేవాళ్ళు మౌలిక వసతులు సమకూర్చే వాళ్ళు అలాంటి చట్టాన్ని ఈ రోజున మోడీ అధికారంలోకి వచ్చి కార్పొరేటుకు ప్రజల సంపదను దో సి పెట్టాలని ప్రజల వద్ద ఉన్నటువంటి పని హక్కును దోపిడీ చేస్తూ దుర్మార్గమైన చట్టాన్ని తీసుకురావడం జరిగిందని ఈ పథకం వల్ల ఎన్ని రోజులు పని ఉంటుందో ఎన్ని రోజులు ఉండదో గ్యారెంటీ లేదని గతంలో చట్టం ఉన్నప్పుడు 90 శాతం కేంద్ర నిధులు ఇచ్చేదని 10 శాతం రాష్ట్ర నిధులు ఇచ్చేదని కానీ ఇప్పుడు 60% కేంద్రం 40% రాష్ట్రం ఇవ్వాలని చెప్పి పథకాన్ని తెచ్చారని దీనివలన జీవనోపాధి కోల్పోయే ప్రమాదం ఉందని మళ్లీ వలసలు మొదలయ్యే దౌర్భాగ్యం ఏర్పడింది కాబట్టి ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మరి చట్టం గురించి ఖండించకపోగా మోడీ చెప్పిన ప్రతి దానికి కూడా ప్రతి చట్టానికి కూడా ఆమోదిస్తున్నారని కాబట్టి దీనిని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ తరఫున ఖండింస్తున్నామని పార్టీ పిలుపు మేరకు జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని యధాప్రకారం కొనసాగించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో చాట్ల బాబురావు కలపాల జ్యోతి ఆడుమిల్లి ధనలక్ష్మి ఆడిమిల్లి వెంకటేశ్వరావు పార్టీ సభ్యులు పాల్గొన్నారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News