జాతీయ రహదారి పక్కనే దొంగల ఆగడాలు
జాతీయ రహదారి పక్కనే దొంగల ఆగడాలు
Biksham
చివ్వెంల మండలంలో భద్రతపై రైతుల ఆందోళన
చివ్వెంల: జాతీయ రహదారి ఎన్హెచ్–365కు అతి సమీపంలోనే దొంగలు రెచ్చిపోవడం చివ్వెంల మండలంలో భద్రతపై తీవ్ర సందేహాలు కలిగిస్తోంది. అక్కలదేవిగూడెం గ్రామ పరిధిలో అమరగాని ఆంజనేయులు కు చెందిన వ్యవసాయ భూమిలో ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్ లోని విలువైన పనిముట్లను గుర్తుతెలియని దొంగలు రాత్రి వేళ దొంగిలించారు.ఈ ఘటనలో రైతులకు అత్యంత అవసరమైన స్టార్టర్ పెట్టెలు, విద్యుత్ వైర్లు ఎత్తుకెళ్లడంతో సాగు పనులు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే పంటల సాగు కోసం సిద్ధమవుతున్న రైతులకు ఈ దొంగతనం తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.జాతీయ రహదారి పక్కనే వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నప్పటికీ సరైన చర్యలు తీసుకోకపోవడంపై రైతులు, గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దొంగలు ఇప్పటికీ పట్టుబడకపోవడంతో గ్రామంలో భయాందోళన వాతావరణం నెలకొంది.రాత్రి వేళ పహారా ఏర్పాటు చేయాలని, పోలీస్ గస్తీని పెంచాలని, దొంగతనాలకు పాల్పడుతున్న వారిని వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. రైతుల ఆస్తులకు భద్రత కల్పించాల్సిన బాధ్యత అధికారులదేనని వారు స్పష్టం చేస్తున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి