Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గుంజలూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 04:53 PM

జాతీయ రహదారి 65పై కారు ఢీకొని ద్విచక్ర వాహనదారుడు మృతి

జాతీయ రహదారి 65పై కారు ఢీకొని ద్విచక్ర వాహనదారుడు మృతి

జాతీయ రహదారి 65పై కారు ఢీకొని ద్విచక్ర వాహనదారుడు మృతి
January 22, 2026 07:49 PM 947 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా స్థానికం ప్రతినిధి కృష్ణ నాలుగు గంటల సమయంలో జాతీయ రహదారి 65పై కావేలి గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కావేలి గ్రామానికి చెందిన నాయకుడు నాగేందర్ తండ్రి నరసయ్య (వయస్సు 61) కావేలి నుంచి దిగ్వాల్ వైపు తన ద్విచక్ర వాహనంపై వెళ్తున్నాడు.ఈ క్రమంలో వెనుక నుంచి అత్యంత వేగంగా, నిర్లక్ష్యంగా నడుపబడుతున్న కారు (నంబరు KA 38 F 1327) అతని వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న తీవ్రతకు నాగేందర్ సన్నాఫ్ నరసయ్య అక్కడికక్కడే మృతి చెందాడు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి, పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, కారు డ్రైవర్‌పై చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంతో కావేలి గ్రామంలో విషాదం నెలకొంది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News