Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:43 PM

జాతర నేపథ్యంలో డాగ్ స్క్వాడ్ తనిఖీలు – అప్రమత్తంగా పోలీసులు

జాతర నేపథ్యంలో డాగ్ స్క్వాడ్ తనిఖీలు – అప్రమత్తంగా పోలీసులు

జాతర నేపథ్యంలో డాగ్ స్క్వాడ్ తనిఖీలు – అప్రమత్తంగా పోలీసులు
April 06, 2026 07:29 PM 43 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

అల్లాదుర్గం మండల పరిధిలోని కేంద్రంలో ఉన్న బేతాళ స్వామి ఆలయం వద్ద రేపు నిర్వహించనున్న జాతరను పురస్కరించుకుని పోలీసులు ముందస్తు భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు. జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు ఈ రోజు డాగ్ స్క్వాడ్ సిబ్బంది, ఎస్సై శంకర్ కలిసి ఆలయ పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. జాతర సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతారని భావించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులపై కఠినంగా తనిఖీలు చేపట్టడంతో పాటు మత్తు పదార్థాల వినియోగం, చట్టవ్యతిరేక చర్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని పోలీసులు హెచ్చరించారు. జాతరకు వచ్చే భక్తులు పోలీసులకు సహకరించాలని, ఏదైనా అనుమానం ఉన్న వెంటనే సమాచారం అందించాలని సూచిస్తూ ప్రజల భద్రత కోసం పోలీసులు అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News