జాతర నేపథ్యంలో డాగ్ స్క్వాడ్ తనిఖీలు – అప్రమత్తంగా పోలీసులు
జాతర నేపథ్యంలో డాగ్ స్క్వాడ్ తనిఖీలు – అప్రమత్తంగా పోలీసులు
Krishna
అల్లాదుర్గం మండల పరిధిలోని కేంద్రంలో ఉన్న బేతాళ స్వామి ఆలయం వద్ద రేపు నిర్వహించనున్న జాతరను పురస్కరించుకుని పోలీసులు ముందస్తు భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు. జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు ఈ రోజు డాగ్ స్క్వాడ్ సిబ్బంది, ఎస్సై శంకర్ కలిసి ఆలయ పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. జాతర సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతారని భావించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులపై కఠినంగా తనిఖీలు చేపట్టడంతో పాటు మత్తు పదార్థాల వినియోగం, చట్టవ్యతిరేక చర్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని పోలీసులు హెచ్చరించారు. జాతరకు వచ్చే భక్తులు పోలీసులకు సహకరించాలని, ఏదైనా అనుమానం ఉన్న వెంటనే సమాచారం అందించాలని సూచిస్తూ ప్రజల భద్రత కోసం పోలీసులు అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి