Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:25 PM

జర్నలిస్టులు శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకోవాలి

జర్నలిస్టులు శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకోవాలి

జర్నలిస్టులు శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకోవాలి
January 14, 2026 04:06 PM 20 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి

టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు గార్లపాటి కృష్ణారెడ్డి పిలుపు

జనవరి 23,24వ తేదీల్లో హైదరాబాదులోని నాంపల్లి లో ఉన్న మీడియా అకాడమీ ఆడిటోరియంలో జరగనున్న జర్నలిస్టుల శిక్షణా తరగతులను జిల్లాలోని అన్ని మండలాలకు చెందిన జర్నలిస్టులు సద్వినియోగం చేసుకోవాలని టి యు డబ్ల్యూజె ( ఐజేయు) జిల్లా అధ్యక్షులు గార్లపాటి కృష్ణారెడ్డి కోరారు. శిక్షణ తరగతులను దృష్టిలో ఉంచుకొని బుధవారం నాడు జిల్లాలోని పలు మండలాల్లో పర్యటించిన అనంతరం చిట్యాల లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ మీడియా అకాడమీ,టీయూడబ్ల్యూజే(ఐజేయు ) ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహించే ఈ శిక్షణ తరగతులకు సంబంధించి ఆసక్తి ఉన్న జర్నలిస్టులు ఈనెల 17వ తేదీలోగా టి యు డబ్ల్యూ జె జిల్లా కమిటీకి తమ పేర్లను అందజేయాలని తెలిపారు. జర్నలిజంలో వృత్తిపరంగా ఎంతో నైపుణ్యం కోసం అందజేస్తున్న ఈ శిక్షణ జర్నలిస్టులకు ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. జర్నలిస్టుల సంక్షేమం అభివృద్ధి కోసం కృషి చేస్తూనే, వృత్తిపరంగా మెలకువలు నేర్పించడం కోసం శిక్షణ తరగతులు ఏర్పాటుచేసిన మీడియా అకాడమీ చైర్మన్ కే. శ్రీనివాస్ రెడ్డి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి అక్రిడేషన్ తో పాటు ఇంటి స్థలం, ఇల్లు, హెల్త్ కార్డులు అందించడం కోసం టియుడబ్ల్యూజే జిల్లా కమిటీ నిరంతరం కృషి చేస్తుందని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో టీయూడబ్ల్యూజే జిల్లా నాయకులు పులిమామిడి మహేందర్ రెడ్డి, దోటి శ్రీనివాస్,యే ళ్ల బయన్న, మెండె వెంకన్న, పోకల కరుణాకర్, చెరుపల్లి శ్రీనివాస్, మిరియాల ప్రకాష్, అమరోజు వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News