Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పర్సు పోయింది.. దొరికితే సమాచారం ఇవ్వండి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 03:06 AM

జర్నలిస్టులపై దాడి హేయమైన చర్య

జర్నలిస్టులపై దాడి హేయమైన చర్య

జర్నలిస్టులపై దాడి హేయమైన చర్య
07-02-2026 20 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

వీడియో చిత్రీకరిస్తున్న జర్నలిస్టులపై దాడి చేయడం అత్యంత హేయమైన

మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్

కోదాడ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను మద్యం, ధన ప్రలోభాలతో ప్రభావితం చేస్తున్న కాంగ్రెస్ నాయకుల అక్రమాలను వీడియోల్లో చిత్రీకరిస్తున్న జర్నలిస్టులపై దాడి చేయడం అత్యంత హేయమైన, నీచమైన చర్యగా మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ కోదాడ నియోజకవర్గ నేత బొల్లం మల్లయ్య యాదవ్ తీవ్రంగా ఖండించారు.ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు. ప్రజలకు నిజాలు తెలియకూడదనే భయంతో మీడియా గొంతు నొక్కే ప్రయత్నమే ఈ దాడుల వెనుక ఉన్న అసలైన ఉద్దేశమని ఆయన ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభంగా ఉన్న మీడియాపై దాడులు చేయడం రాజ్యాంగ విలువలకు విరుద్ధమని స్పష్టం చేశారు.కోదాడ నియోజకవర్గంలో జర్నలిస్టులపై జరిగిన ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నానని పేర్కొన్న ఆయన, దాడికి పాల్పడిన వారిని వెంటనే గుర్తించి, ఎలాంటి రాజకీయ ఒత్తిడులకు లోనుకాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖను డిమాండ్ చేశారు.

మీడియా స్వేచ్ఛను కాపాడటం, ప్రజాస్వామ్యాన్ని రక్షించడం ప్రభుత్వ బాధ్యత అని ఈ సందర్భంగా బొల్లం మల్లయ్య యాదవ్ గుర్తు చేశారు.

Sthanikam

జర్నలిస్టులపై దాడి హేయమైన చర్య

Article Image

వీడియో చిత్రీకరిస్తున్న జర్నలిస్టులపై దాడి చేయడం అత్యంత హేయమైన

మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్

కోదాడ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను మద్యం, ధన ప్రలోభాలతో ప్రభావితం చేస్తున్న కాంగ్రెస్ నాయకుల అక్రమాలను వీడియోల్లో చిత్రీకరిస్తున్న జర్నలిస్టులపై దాడి చేయడం అత్యంత హేయమైన, నీచమైన చర్యగా మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ కోదాడ నియోజకవర్గ నేత బొల్లం మల్లయ్య యాదవ్ తీవ్రంగా ఖండించారు.ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు. ప్రజలకు నిజాలు తెలియకూడదనే భయంతో మీడియా గొంతు నొక్కే ప్రయత్నమే ఈ దాడుల వెనుక ఉన్న అసలైన ఉద్దేశమని ఆయన ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభంగా ఉన్న మీడియాపై దాడులు చేయడం రాజ్యాంగ విలువలకు విరుద్ధమని స్పష్టం చేశారు.కోదాడ నియోజకవర్గంలో జర్నలిస్టులపై జరిగిన ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నానని పేర్కొన్న ఆయన, దాడికి పాల్పడిన వారిని వెంటనే గుర్తించి, ఎలాంటి రాజకీయ ఒత్తిడులకు లోనుకాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖను డిమాండ్ చేశారు.

మీడియా స్వేచ్ఛను కాపాడటం, ప్రజాస్వామ్యాన్ని రక్షించడం ప్రభుత్వ బాధ్యత అని ఈ సందర్భంగా బొల్లం మల్లయ్య యాదవ్ గుర్తు చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News