జర్నలిస్టులపై దాడి హేయమైన చర్య
జర్నలిస్టులపై దాడి హేయమైన చర్య
Harish HS
వీడియో చిత్రీకరిస్తున్న జర్నలిస్టులపై దాడి చేయడం అత్యంత హేయమైన
మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
కోదాడ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను మద్యం, ధన ప్రలోభాలతో ప్రభావితం చేస్తున్న కాంగ్రెస్ నాయకుల అక్రమాలను వీడియోల్లో చిత్రీకరిస్తున్న జర్నలిస్టులపై దాడి చేయడం అత్యంత హేయమైన, నీచమైన చర్యగా మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ కోదాడ నియోజకవర్గ నేత బొల్లం మల్లయ్య యాదవ్ తీవ్రంగా ఖండించారు.ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు. ప్రజలకు నిజాలు తెలియకూడదనే భయంతో మీడియా గొంతు నొక్కే ప్రయత్నమే ఈ దాడుల వెనుక ఉన్న అసలైన ఉద్దేశమని ఆయన ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభంగా ఉన్న మీడియాపై దాడులు చేయడం రాజ్యాంగ విలువలకు విరుద్ధమని స్పష్టం చేశారు.కోదాడ నియోజకవర్గంలో జర్నలిస్టులపై జరిగిన ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నానని పేర్కొన్న ఆయన, దాడికి పాల్పడిన వారిని వెంటనే గుర్తించి, ఎలాంటి రాజకీయ ఒత్తిడులకు లోనుకాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖను డిమాండ్ చేశారు.
మీడియా స్వేచ్ఛను కాపాడటం, ప్రజాస్వామ్యాన్ని రక్షించడం ప్రభుత్వ బాధ్యత అని ఈ సందర్భంగా బొల్లం మల్లయ్య యాదవ్ గుర్తు చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి