Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పర్సు పోయింది.. దొరికితే సమాచారం ఇవ్వండి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 02:31 AM

జర్నలిస్టులపై దాడి

జర్నలిస్టులపై దాడి

జర్నలిస్టులపై దాడి
07-02-2026 22 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

జర్నలిస్టులపై దాడి

డబ్బు పంపిణీ వీడియోలు చిత్రీకరించారనే ఆగ్రహంతో అభ్యర్థుల అనుచరుల ఘాతుకం

కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డు మున్సిపల్ ఎన్నికల ప్రచారం సందర్భంగా డబ్బు పంపిణీ జరుగుతున్న దృశ్యాలను వీడియోల రూపంలో చిత్రీకరిస్తున్న జర్నలిస్టులపై అభ్యర్థుల అనుచరులు దాడికి పాల్పడిన ఘటన పట్టణంలో కలకలం రేపింది.

ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు పంపిణీ చేస్తున్న దృశ్యాలను ప్రజల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో జర్నలిస్టులు వీడియోలు తీస్తుండగా,అడ్డుకునేందుకు కొందరు దుండగులు దాడి చేసి భయభ్రాంతులకు గురిచేశారు. ఈ దాడిలో పలువురు జర్నలిస్టులు గాయపడినట్లు సమాచారం.

ఈ ఘటనకు నిరసనగా బాధిత జర్నలిస్టులు కోదాడ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. జర్నలిస్టులపై దాడి ప్రజాస్వామ్యానికి ముప్పు అని, దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

ఎన్నికల వేళ జర్నలిస్టులపై దాడులు జరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని, మీడియా స్వేచ్ఛకు భంగం కలిగించే ఇలాంటి చర్యలను సహించబోమని జర్నలిస్టు సంఘాలు హెచ్చరిస్తున్నాయి.


Sthanikam

జర్నలిస్టులపై దాడి

Article Image

జర్నలిస్టులపై దాడి

డబ్బు పంపిణీ వీడియోలు చిత్రీకరించారనే ఆగ్రహంతో అభ్యర్థుల అనుచరుల ఘాతుకం

కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డు మున్సిపల్ ఎన్నికల ప్రచారం సందర్భంగా డబ్బు పంపిణీ జరుగుతున్న దృశ్యాలను వీడియోల రూపంలో చిత్రీకరిస్తున్న జర్నలిస్టులపై అభ్యర్థుల అనుచరులు దాడికి పాల్పడిన ఘటన పట్టణంలో కలకలం రేపింది.

ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు పంపిణీ చేస్తున్న దృశ్యాలను ప్రజల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో జర్నలిస్టులు వీడియోలు తీస్తుండగా,అడ్డుకునేందుకు కొందరు దుండగులు దాడి చేసి భయభ్రాంతులకు గురిచేశారు. ఈ దాడిలో పలువురు జర్నలిస్టులు గాయపడినట్లు సమాచారం.

ఈ ఘటనకు నిరసనగా బాధిత జర్నలిస్టులు కోదాడ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. జర్నలిస్టులపై దాడి ప్రజాస్వామ్యానికి ముప్పు అని, దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

ఎన్నికల వేళ జర్నలిస్టులపై దాడులు జరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని, మీడియా స్వేచ్ఛకు భంగం కలిగించే ఇలాంటి చర్యలను సహించబోమని జర్నలిస్టు సంఘాలు హెచ్చరిస్తున్నాయి.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News