Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:23 PM

జర్నలిస్టులపై దాడి

జర్నలిస్టులపై దాడి

జర్నలిస్టులపై దాడి
February 07, 2026 10:17 PM 12 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

జర్నలిస్టులపై దాడి

డబ్బు పంపిణీ వీడియోలు చిత్రీకరించారనే ఆగ్రహంతో అభ్యర్థుల అనుచరుల ఘాతుకం

కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డు మున్సిపల్ ఎన్నికల ప్రచారం సందర్భంగా డబ్బు పంపిణీ జరుగుతున్న దృశ్యాలను వీడియోల రూపంలో చిత్రీకరిస్తున్న జర్నలిస్టులపై అభ్యర్థుల అనుచరులు దాడికి పాల్పడిన ఘటన పట్టణంలో కలకలం రేపింది.

ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు పంపిణీ చేస్తున్న దృశ్యాలను ప్రజల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో జర్నలిస్టులు వీడియోలు తీస్తుండగా,అడ్డుకునేందుకు కొందరు దుండగులు దాడి చేసి భయభ్రాంతులకు గురిచేశారు. ఈ దాడిలో పలువురు జర్నలిస్టులు గాయపడినట్లు సమాచారం.

ఈ ఘటనకు నిరసనగా బాధిత జర్నలిస్టులు కోదాడ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. జర్నలిస్టులపై దాడి ప్రజాస్వామ్యానికి ముప్పు అని, దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

ఎన్నికల వేళ జర్నలిస్టులపై దాడులు జరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని, మీడియా స్వేచ్ఛకు భంగం కలిగించే ఇలాంటి చర్యలను సహించబోమని జర్నలిస్టు సంఘాలు హెచ్చరిస్తున్నాయి.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News