Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:27 PM

జర్నలిస్టులకు త్వరగా అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలి

జర్నలిస్టులకు త్వరగా అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలి

జర్నలిస్టులకు త్వరగా అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలి
January 30, 2026 08:11 PM 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

జిల్లా అధ్యక్షులు గుండెగోని జయశంకర్.

జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో టీయూడబ్ల్యూజే (H-143) నిరంతరం కృషి చేస్తుందని, జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులను ప్రభుత్వం తక్షణమే జారీ చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షులు గుండగోని జయశంకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

చిట్యాల మండల కేంద్రంలోని బీఆర్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన టీయూడబ్ల్యూజే (H-143) చిట్యాల మండల నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా అధ్యక్షుడిగా రేగొండ వేణుమాధవ్, ప్రధాన కార్యదర్శిగా చెన్నోజు చంద్రశేఖర్, ఉపాధ్యక్షుడిగా అంతటి శ్రీనివాస్ గౌడ్, కోశాధికారిగా బొడిగె విజయ్ కుమార్, కార్యదర్శిగా మూడ వెంకటాద్రి ప్రమాణ స్వీకారం చేశారు.

అనంతరం గుండగోని జయశంకర్ మాట్లాడుతూ, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను జర్నలిస్టులకు కూడా వర్తింపజేయాలని కోరారు. జర్నలిస్టులకు హెల్త్ కార్డులు మంజూరు చేసి, కార్పొరేట్ వైద్యం అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు. జర్నలిస్టుల అభ్యున్నతి, సమస్యల పరిష్కారానికి తమ యూనియన్ ప్రత్యేక దృష్టి సారించి అవసరమైన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే జిల్లా ప్రధాన కార్యదర్శి వీరస్వామి, కార్యదర్శులు మూడ వేణు, చిరబోయిన మల్లేష్, TEMJU అధ్యక్షులు వెంకట్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి జానయ్య, నకిరేకల్ నియోజకవర్గం అధ్యక్షులు కొమ్ము యాదగిరి, ప్రధాన కార్యదర్శి శిరసు రమేష్, TEMJU నకిరేకల్ అధ్యక్షులు కొల్లోజు శ్రీకాంత్, బండారు చందు, కారంపూరి మధు, మారగోని శ్రవణ్, సంతోష్, దేశగాని సాయికుమార్, పల్లపు ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News