జర్నలిస్టులకు త్వరగా అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలి
జర్నలిస్టులకు త్వరగా అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలి
Komidala Mahender reddy
జిల్లా అధ్యక్షులు గుండెగోని జయశంకర్.
జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో టీయూడబ్ల్యూజే (H-143) నిరంతరం కృషి చేస్తుందని, జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులను ప్రభుత్వం తక్షణమే జారీ చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షులు గుండగోని జయశంకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
చిట్యాల మండల కేంద్రంలోని బీఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన టీయూడబ్ల్యూజే (H-143) చిట్యాల మండల నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా అధ్యక్షుడిగా రేగొండ వేణుమాధవ్, ప్రధాన కార్యదర్శిగా చెన్నోజు చంద్రశేఖర్, ఉపాధ్యక్షుడిగా అంతటి శ్రీనివాస్ గౌడ్, కోశాధికారిగా బొడిగె విజయ్ కుమార్, కార్యదర్శిగా మూడ వెంకటాద్రి ప్రమాణ స్వీకారం చేశారు.
అనంతరం గుండగోని జయశంకర్ మాట్లాడుతూ, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను జర్నలిస్టులకు కూడా వర్తింపజేయాలని కోరారు. జర్నలిస్టులకు హెల్త్ కార్డులు మంజూరు చేసి, కార్పొరేట్ వైద్యం అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు. జర్నలిస్టుల అభ్యున్నతి, సమస్యల పరిష్కారానికి తమ యూనియన్ ప్రత్యేక దృష్టి సారించి అవసరమైన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే జిల్లా ప్రధాన కార్యదర్శి వీరస్వామి, కార్యదర్శులు మూడ వేణు, చిరబోయిన మల్లేష్, TEMJU అధ్యక్షులు వెంకట్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి జానయ్య, నకిరేకల్ నియోజకవర్గం అధ్యక్షులు కొమ్ము యాదగిరి, ప్రధాన కార్యదర్శి శిరసు రమేష్, TEMJU నకిరేకల్ అధ్యక్షులు కొల్లోజు శ్రీకాంత్, బండారు చందు, కారంపూరి మధు, మారగోని శ్రవణ్, సంతోష్, దేశగాని సాయికుమార్, పల్లపు ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి