Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యా ప్రగతికి నిదర్శనంగా మహిళా డిగ్రీ కళాశాల సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 01:59 AM

జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి.

జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి.

జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి.
February 22, 2026 05:59 AM 12 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

వృత్తిలో కొనసాగుతున్న వారందరికీ బే షరతుగా అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలి.

టీజేయు మండల గౌరవ అధ్యక్షుడు నోముల రవీందర్ రెడ్డి

ఆత్మకూరు(ఎం): జర్నలిస్టుల సమస్యలు ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని యాదాద్రి భువనగిరి జిల్లా తెలంగాణ జర్నలిస్టుల యూనియన్ జిల్లా సహాయ కార్యదర్శి ఆత్మకూరు(ఎం)మండల గౌరవ అధ్యక్షులు నోముల రవిందర్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.శనివారం రోజు మండల కేంద్రంలోని టీజేయూ కార్యాలయంలో మాట్లాడుతూ... జర్నలిస్టులు సమాజంలో అనేక సవాళ్లను ఎదుర్కొంటూ తమ వృత్తి ధర్మాన్ని కొనసాగిస్తున్నారు. వృత్తి పరిరక్షణకు జర్నలిస్టులు ఐక్యంగా ఉంటేనే మనుగడా సాధించగలుగుతారని అన్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి టీజేయు అహర్నిశలు పాటుపడుతూ పోరాటాలు చేపడుతుందన్నారు. నేటి పరిస్థితులు చిన్న పత్రికలు మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టులు క్రియాశీలక పాత్రను పోషిస్తున్నారని అన్నారు. ప్రజల సమస్యలను ప్రతిబింబించే కథనాలు కవరేజీలను చేయడంలో తమ బాధ్యతను నెరవేర్చుతున్నారని తెలిపారు. ఈ క్రమంలో అనేక ఆటుపోట్లు ఎదురైన సమాజ హితం కోసం రాజీ పడకుండా వృత్తిని కొనసాగిస్తున్నారని అన్నారు. జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వాలు చిన్న చూపుగా వ్యవహరించడం జరిగింది ఈ విధానం సరికాదన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ముఖ్య భూమిక పోషించిన జర్నలిస్టులకు అనేక హామీలు ఇచ్చిన గత(కిందటి) ప్రభుత్వం మోసగించిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికల్లో జర్నలిస్టులకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం ప్రెస్ అకాడమీ ప్రత్యేక చొరవ కనపర్చాలన్నారు.ప్రభుత్వం జర్నలిస్టులపై దాడుల నియంత్రణకై పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. అక్రిడేషన్ కార్డులు వృత్తిలో కొనసాగుతున్న ప్రతి జర్నలిస్టుకు బేసరుతుగా జారీ చేయాలన్నారు. అక్రిడేషన్ జిల్లా స్థాయి కమిటీల సూచనలు తప్పనిసరిగా పరిగణించి ఏం ఫైనల్లో చేర్చాలన్నారు. ఇండ్ల స్థలాలు,ఇండ్ల మంజూరు చేయాలన్నారు.జర్నలిస్టులకు ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి ఇవ్వాలని అన్నారు. ఈ సమస్యల పరిష్కారానికి టీజేయు భవిష్యత్తు కార్యచరణ రూపొందించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తుందన్నారు. జర్నలిస్టులు ఐక్యంగా ఉండి సాధించుకోవాలని సూచించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News