Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 02:36 AM

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాన్ని కోరిన టీడబ్యూజేఎఫ్‌

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాన్ని కోరిన టీడబ్యూజేఎఫ్‌

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాన్ని కోరిన టీడబ్యూజేఎఫ్‌
June 02, 2026 05:49 AM 31 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

అబ్దుల్లాపూర్ మెట్టు, : జర్నలిస్టుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని టీడబ్యూజేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. బసవ పున్నయ్య డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా జర్నలిస్టులకు ఫ్యూచర్ సిటీలో ఇండ్ల స్థలాలు కేటాయించడంతో పాటు ప్రభుత్వ అధికారుల హెల్త్ స్కీంలో జర్నలిస్టులను చేర్చాలని కోరారు.

సోమవారం అబ్దుల్లాపూర్ మెట్టు మండల కేంద్రంలోని వి.వి. బ్యాంకెట్ హాల్‌లో నిర్వహించిన టీడబ్యూజేఎఫ్ రంగారెడ్డి జిల్లా కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లా అధ్యక్షుడు శేరిబాయి గణేష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మైల సైదులు, కోశాధికారి శ్రీనివాస్ చారి, నేషనల్ కమిటీ సభ్యుడు దేవేందర్ తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా బసవ పున్నయ్య మాట్లాడుతూ వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ ప్రక్రియను వేగవంతం చేసి అర్హులైన వారందరికీ కార్డులు జారీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఫీల్డ్ జర్నలిస్టులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అక్రిడిటేషన్ కార్డులు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.

జర్నలిస్టుల ఆరోగ్య భద్రత దృష్ట్యా ప్రభుత్వ అధికారులకు అమలు చేస్తున్న హెల్త్ స్కీంలో జర్నలిస్టులను కూడా చేర్చాలని సూచించారు. అలాగే హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న జర్నలిస్టులతో పాటు రంగారెడ్డి జిల్లాలో విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టుల వివరాలు సేకరించి ఫ్యూచర్ సిటీలో ఇండ్ల స్థలాలు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు.

జర్నలిస్టుల పిల్లలకు విద్యా రాయితీలు కల్పించాలని, ప్రైవేట్ మరియు కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజు రాయితీ అమలు చేసేలా జిల్లా కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పి. వెంకటేశ్‌, మణికుమార్‌ , రఘునంధన్‌ ‌గౌడ్‌, సుధర్శన్‌ ‌గౌడ్‌, శ్రీనివాస్‌ , నర్సింహ్మ, రాజశేఖర్‌ , రాష్ట్ర కౌన్సిల్‌ ‌సభ్యులు యాదగిరి, జిల్లా ప్రచార కార్యదర్శి నర్సింహ్మరెడ్డి, సోషల్‌ ‌మీడియా కమిటీ కన్వీనర్‌ పులిపలుపుల ‌శివ కుమార్‌ ‌గౌడ్‌ , జిల్లా కమిటీ సభ్యులు శ్రీశైలం, అంజి, నియోజకవర్గాల అధ్యక్ష‍, కార్యదర్శులు యాదగిరి, రాఘవేందర్‌ ‌గౌడ్‌, రాజు, జైచందర్‌ , శంకర్‌, బుచ్చయ్య, జర్నలిస్టులు, తెలుసూరి మల్లేష్‌, కొండ మల్లేశం గౌడ్ యకుబ్‌ ‌పాష, తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News