జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా
Biksham
జిల్లా కమిటీ సభ్యులను సన్మానించిన రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి అన్నారు.శనివారం పట్టణంలోని కృష్ణానగర్ కాలనీలో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సమాఖ్య జిల్లా అధ్యక్షుడు పాల్వాయి జానయ్యతో పాటు నూతన కమిటీ సభ్యులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించిన సర్వోత్తమ్ రెడ్డి మాట్లాడుతూ సమాజానికి విలువలతో కూడిన జర్నలిజం అవసరమని అన్నారు. ప్రభుత్వం మరియు ప్రజల మధ్య వారధిగా పనిచేసే జర్నలిస్టులు బాధ్యతతో వ్యవహరించాలని కోరారు.
ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉండటంతో జర్నలిజం స్వరూపం మారిపోయిందని, నిజమైన విలువలు కాపాడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. జర్నలిజం రక్షణ కోసం సంఘటిత కృషి అవసరమని అన్నారు.
ఇళ్ల స్థలాలు, ఆరోగ్య కార్డులు, ప్రమాద బీమా, గుర్తింపు కార్డులు వంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జిల్లా కేంద్రంలో స్వర్గీయ రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి ప్రారంభించిన స్థలంలో ఆయన పేరుతో పత్రికా భవనం నిర్మాణానికి సహకరిస్తానని తెలిపారు.అనంతరం జిల్లా కమిటీ సభ్యులను ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో లింగాల సాయిబాబా, శ్రీరాముల కృష్ణ, నందిపాటి సైదులు, గూడపూరి ప్రభాకర్, దోసపాటి అజయ్ గౌడ్, కొంగల సతీష్, నాగరాజు, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి