Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
Community Power for Health: Walkathon Sparks Preventive Care Movement సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 02:34 PM

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా
April 11, 2026 12:54 PM 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

జిల్లా కమిటీ సభ్యులను సన్మానించిన రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి అన్నారు.శనివారం పట్టణంలోని కృష్ణానగర్ కాలనీలో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సమాఖ్య జిల్లా అధ్యక్షుడు పాల్వాయి జానయ్యతో పాటు నూతన కమిటీ సభ్యులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించిన సర్వోత్తమ్ రెడ్డి మాట్లాడుతూ సమాజానికి విలువలతో కూడిన జర్నలిజం అవసరమని అన్నారు. ప్రభుత్వం మరియు ప్రజల మధ్య వారధిగా పనిచేసే జర్నలిస్టులు బాధ్యతతో వ్యవహరించాలని కోరారు.

ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉండటంతో జర్నలిజం స్వరూపం మారిపోయిందని, నిజమైన విలువలు కాపాడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. జర్నలిజం రక్షణ కోసం సంఘటిత కృషి అవసరమని అన్నారు.

ఇళ్ల స్థలాలు, ఆరోగ్య కార్డులు, ప్రమాద బీమా, గుర్తింపు కార్డులు వంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జిల్లా కేంద్రంలో స్వర్గీయ రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి ప్రారంభించిన స్థలంలో ఆయన పేరుతో పత్రికా భవనం నిర్మాణానికి సహకరిస్తానని తెలిపారు.అనంతరం జిల్లా కమిటీ సభ్యులను ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో లింగాల సాయిబాబా, శ్రీరాముల కృష్ణ, నందిపాటి సైదులు, గూడపూరి ప్రభాకర్, దోసపాటి అజయ్ గౌడ్, కొంగల సతీష్, నాగరాజు, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News