Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 04:04 AM

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా
April 11, 2026 12:54 PM 78 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

జిల్లా కమిటీ సభ్యులను సన్మానించిన రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి అన్నారు.శనివారం పట్టణంలోని కృష్ణానగర్ కాలనీలో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సమాఖ్య జిల్లా అధ్యక్షుడు పాల్వాయి జానయ్యతో పాటు నూతన కమిటీ సభ్యులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించిన సర్వోత్తమ్ రెడ్డి మాట్లాడుతూ సమాజానికి విలువలతో కూడిన జర్నలిజం అవసరమని అన్నారు. ప్రభుత్వం మరియు ప్రజల మధ్య వారధిగా పనిచేసే జర్నలిస్టులు బాధ్యతతో వ్యవహరించాలని కోరారు.

ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉండటంతో జర్నలిజం స్వరూపం మారిపోయిందని, నిజమైన విలువలు కాపాడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. జర్నలిజం రక్షణ కోసం సంఘటిత కృషి అవసరమని అన్నారు.

ఇళ్ల స్థలాలు, ఆరోగ్య కార్డులు, ప్రమాద బీమా, గుర్తింపు కార్డులు వంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జిల్లా కేంద్రంలో స్వర్గీయ రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి ప్రారంభించిన స్థలంలో ఆయన పేరుతో పత్రికా భవనం నిర్మాణానికి సహకరిస్తానని తెలిపారు.అనంతరం జిల్లా కమిటీ సభ్యులను ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో లింగాల సాయిబాబా, శ్రీరాముల కృష్ణ, నందిపాటి సైదులు, గూడపూరి ప్రభాకర్, దోసపాటి అజయ్ గౌడ్, కొంగల సతీష్, నాగరాజు, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News