జర్నలిస్టుల పాదయాత్రను జయప్రదం చేయాలి
జర్నలిస్టుల పాదయాత్రను జయప్రదం చేయాలి
Biksham
టీఎస్ జేఏ అధ్యక్షులు - కందుకూరి యాదగిరి
సూర్యాపేట స్థానికం ప్రతినిధి బిక్షం
సూర్యాపేట జిల్లా కేంద్రంలో పక్క ప్రెస్ క్లబ్ భవనం నిర్మించాలని డిమాండ్ చేస్తూ
తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ అసోసియేషన్ (TSJA) ఆధ్వర్యంలో
జనవరి 5 తారీకు సూర్యాపేట జిల్లా కేంద్రం కోర్టు భవనము నుండి కొత్త బస్టాండ్ వరకు
నిర్వహించబోయే పాదయాత్రను జయప్రదం చేయాలని అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కందుకూరి యాదగిరి పిలుపునిచ్చారు.
మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో అసోసియేషన్ నాయకులతో ఏర్పాటు చేసిన కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఎంతో చరిత్ర కలిగిన సూర్యాపేట జిల్లా కేంద్రంలో జర్నలిస్టులకు నిలువ నీడ లేకపోవడం విచారకరం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి పాత మిర్చి యార్డులో ప్రెస్ క్లబ్ భవనాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.
తమ పాదయాత్రకు మద్దతు తెలపాల్సిందిగా ఇతర జర్నలిస్టు యూనియన్ లను కోరారు. సమస్యలు పరిష్కరించుకునేందుకు యూనియన్లకు అతీతంగా అందరూ కలిసి రావాలని కోరారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షుడు దుస్స చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ గౌస్,రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ దుర్గం బాలు, సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు గుంటి శ్రీనివాస్, జిల్లా కౌన్సిల్ సభ్యులు దేశ గాని వెంకట్ గౌడ్, సూర్యాపేట నియోజకవర్గం నాయకులు తాప్సి అనిల్, అసోసియేషన్ సభ్యులు అబ్దుల్ అజీజ్, సందీప్ తదితరులు పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి