Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
Community Power for Health: Walkathon Sparks Preventive Care Movement సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 01:48 PM

జర్నలిస్టుల హక్కులను ప్రభుత్వం కాలరాయద్దు....

జర్నలిస్టుల హక్కులను ప్రభుత్వం కాలరాయద్దు....

జర్నలిస్టుల హక్కులను ప్రభుత్వం కాలరాయద్దు....
December 31, 2025 05:54 PM 21 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

మాజీ మంత్రి,సూర్యాపేట శాసన సభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి....

సూర్యాపేట స్థానిక ప్రతినిధి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల హక్కులను కాలరాయద్దని మాజీ మంత్రి సూర్యాపేట శాసన సభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి అభిప్రాయ పడ్డారు.సమాజ సేవకులుగా పేరొందిన జర్నలిస్టులు అటు ప్రభుత్వాలకు,ఇటు ప్రజలకు వారధిగా పనిచేసే గొప్ప వ్యక్తులని అన్నారు.అటువంటి జర్నలిస్టులను వర్గాలుగా చీల్చి అవమానించ వద్దని పేర్కొన్నారు.రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు నూతనంగా జారీ చేయనున్న అక్రిడేషన్ కార్డుల ప్రక్రియ కోసం జారీ చేసిన జీవో నెం.252 ను సవరించేందుకు మద్దతు ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు టీయూడబ్ల్యూజే (హెచ్–143) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రంలోని స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జర్నలిస్టులకు ఎదురవుతున్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి,జీవో 252 లోని నిబంధనలను సవరించి న్యాయం చేయాలని కోరారు. జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకునేలా చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు.అనంతరం ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మాట్లాడుతూ ఇంతకాలం ఏకతాటిపై ఉన్న జర్నలిస్టులను వర్కింగ్ జర్నలిస్టులు,డెస్క్ జర్నలిస్టులు అనే రెండు వర్గాలుగా చేసి తారతమ్యాలు చూపడం సరికాదన్నారు. గతoలో 239 జీవో ప్రకారం 23 వేల అక్రెడిటేషన్ కార్డులు రాగా, ప్రస్తుతం ప్రభుత్వం నూతనoగా తీసుకొచ్చిన 252 జీవో ప్రకారంతో పోలిస్తే సుమారు 13 వేల అక్రెడిటేషన్ కార్డులు జర్నలిస్టులు కోల్పోతున్నారని, ఇప్పుడు వారంతా ఎటు పోవాలని ప్రశ్నించారు.ప్రస్తుత జీవోను ప్రభుత్వం పునరాలోచిoచి తక్షణమే సవరణ చేయాలని డిమాండ్ చేశారు.లేని యెడల అసెంబ్లీ జర్నలిస్టుల పక్షాన నిలబడి ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు. వినతి పత్రం అందజేసిన వారిలో సంఘ జిల్లా అధ్యక్షులు వజ్జ వీరయ్య యాదవ్‌,బొజ్జ ఎడ్వర్డ్,చల్లా చంద్రశేఖర్, ఊటుకురి రవీందర్, పెద్దింటి శ్యాం సుందర్ రెడ్డి, గుణగంటి సురేష్, అమరగాని నాగేందర్ వల్దాస్ ప్రవీణ్, యాకయ్య బచ్చు పురుషోత్తం, రామచారి, సతీష్, పిన్నెల్లి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News