Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:50 PM

జర్నలిస్టుల హక్కులను ప్రభుత్వం కాలరాయద్దు....

జర్నలిస్టుల హక్కులను ప్రభుత్వం కాలరాయద్దు....

జర్నలిస్టుల హక్కులను ప్రభుత్వం కాలరాయద్దు....
December 31, 2025 05:54 PM 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

మాజీ మంత్రి,సూర్యాపేట శాసన సభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి....

సూర్యాపేట స్థానిక ప్రతినిధి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల హక్కులను కాలరాయద్దని మాజీ మంత్రి సూర్యాపేట శాసన సభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి అభిప్రాయ పడ్డారు.సమాజ సేవకులుగా పేరొందిన జర్నలిస్టులు అటు ప్రభుత్వాలకు,ఇటు ప్రజలకు వారధిగా పనిచేసే గొప్ప వ్యక్తులని అన్నారు.అటువంటి జర్నలిస్టులను వర్గాలుగా చీల్చి అవమానించ వద్దని పేర్కొన్నారు.రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు నూతనంగా జారీ చేయనున్న అక్రిడేషన్ కార్డుల ప్రక్రియ కోసం జారీ చేసిన జీవో నెం.252 ను సవరించేందుకు మద్దతు ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు టీయూడబ్ల్యూజే (హెచ్–143) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రంలోని స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జర్నలిస్టులకు ఎదురవుతున్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి,జీవో 252 లోని నిబంధనలను సవరించి న్యాయం చేయాలని కోరారు. జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకునేలా చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు.అనంతరం ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మాట్లాడుతూ ఇంతకాలం ఏకతాటిపై ఉన్న జర్నలిస్టులను వర్కింగ్ జర్నలిస్టులు,డెస్క్ జర్నలిస్టులు అనే రెండు వర్గాలుగా చేసి తారతమ్యాలు చూపడం సరికాదన్నారు. గతoలో 239 జీవో ప్రకారం 23 వేల అక్రెడిటేషన్ కార్డులు రాగా, ప్రస్తుతం ప్రభుత్వం నూతనoగా తీసుకొచ్చిన 252 జీవో ప్రకారంతో పోలిస్తే సుమారు 13 వేల అక్రెడిటేషన్ కార్డులు జర్నలిస్టులు కోల్పోతున్నారని, ఇప్పుడు వారంతా ఎటు పోవాలని ప్రశ్నించారు.ప్రస్తుత జీవోను ప్రభుత్వం పునరాలోచిoచి తక్షణమే సవరణ చేయాలని డిమాండ్ చేశారు.లేని యెడల అసెంబ్లీ జర్నలిస్టుల పక్షాన నిలబడి ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు. వినతి పత్రం అందజేసిన వారిలో సంఘ జిల్లా అధ్యక్షులు వజ్జ వీరయ్య యాదవ్‌,బొజ్జ ఎడ్వర్డ్,చల్లా చంద్రశేఖర్, ఊటుకురి రవీందర్, పెద్దింటి శ్యాం సుందర్ రెడ్డి, గుణగంటి సురేష్, అమరగాని నాగేందర్ వల్దాస్ ప్రవీణ్, యాకయ్య బచ్చు పురుషోత్తం, రామచారి, సతీష్, పిన్నెల్లి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News