జర్నలిస్టుల అక్రిడిటేషన్ జీవో 252కు సూర్యాపేటలో నిరసన
జర్నలిస్టుల అక్రిడిటేషన్ జీవో 252కు సూర్యాపేటలో నిరసన
Editor Desk
జర్నలిస్టుల అక్రిడిటేషన్కు జీవో 252పై నిరసన
సూర్యాపేట స్థానికం ప్రతినిధి
సూర్యాపేట: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నూతన అక్రిడిటేషన్ జీవో 252 జర్నలిస్టుల హక్కులను కాలరాస్తుందని టియుడబ్ల్యూజె(H-143) జిల్లా అధ్యక్షుడు వజ్జె వీరయ్య యాదవ్ శనివారం విమర్శించారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు నిర్వహించిన నిరసనలో ఆయన, జర్నలిస్టులకు అన్యాయం చేసే విధంగా జీవో రూపొందించబడిందని తెలిపారు.
గతంలో డెస్క్ జర్నలిస్టులు మరియు సాధారణ జర్నలిస్టులందరికీ ఒకే విధంగా ఉన్న అక్రిడిటేషన్ కార్డులను, తాజాగా డెస్క్ జర్నలిస్టులకు మీడియా కార్డు, సాధారణ జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డు పేరిట వేరు చేస్తూ హక్కులను పరిమితం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ కార్డుతో ఏ ప్రయోజనం ఉంటుందో స్పష్టత ఇవ్వక పోవడం, అక్రిడిటేషన్ కార్డుల సంఖ్యను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని దృష్టి సారించారు.
జర్నలిస్టులకు ప్రయోజనకరంగా జీవోను సవరించాలని డిమాండ్ చేస్తూ, వజ్జె వీరయ్య యాదవ్ ఏవోకి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో గుండా శ్రీనివాస్ గుప్తా, హరి కిషన్, బొజ్జ ఎడ్వర్డ్, చల్లా చంద్రశేఖర్, ఊటుకూరి రవీందర్, రాపర్తి మహేష్, పెద్దింటి శ్యాంసుందర్ రెడ్డి, గుణగంటి సురేష్, అమరగాని నాగేందర్, వల్దాస్ ప్రవీణ్, ఫణీంద్ర, సైదిరెడ్డి, చారి, యాకయ్య, పురుషోత్తం, అయినాల శ్రీనివాస్, వీరన్న నాయక్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి