Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
​బీసీ ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలి: ఎంపీ ఆర్. కృష్ణయ్య కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పిం కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 08:36 PM

జర్నలిస్టుల అక్రిడిటేషన్ జీవో 252కు సూర్యాపేటలో నిరసన

జర్నలిస్టుల అక్రిడిటేషన్ జీవో 252కు సూర్యాపేటలో నిరసన

జర్నలిస్టుల అక్రిడిటేషన్ జీవో 252కు సూర్యాపేటలో నిరసన
December 27, 2025 06:45 PM 130 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

జర్నలిస్టుల అక్రిడిటేషన్‌కు జీవో 252పై నిరసన

సూర్యాపేట స్థానికం ప్రతినిధి

సూర్యాపేట: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నూతన అక్రిడిటేషన్ జీవో 252 జర్నలిస్టుల హక్కులను కాలరాస్తుందని టియుడబ్ల్యూజె(H-143) జిల్లా అధ్యక్షుడు వజ్జె వీరయ్య యాదవ్ శనివారం విమర్శించారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు నిర్వహించిన నిరసనలో ఆయన, జర్నలిస్టులకు అన్యాయం చేసే విధంగా జీవో రూపొందించబడిందని తెలిపారు.

గతంలో డెస్క్ జర్నలిస్టులు మరియు సాధారణ జర్నలిస్టులందరికీ ఒకే విధంగా ఉన్న అక్రిడిటేషన్ కార్డులను, తాజాగా డెస్క్ జర్నలిస్టులకు మీడియా కార్డు, సాధారణ జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డు పేరిట వేరు చేస్తూ హక్కులను పరిమితం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ కార్డుతో ఏ ప్రయోజనం ఉంటుందో స్పష్టత ఇవ్వక పోవడం, అక్రిడిటేషన్ కార్డుల సంఖ్యను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని దృష్టి సారించారు.

జర్నలిస్టులకు ప్రయోజనకరంగా జీవోను సవరించాలని డిమాండ్ చేస్తూ, వజ్జె వీరయ్య యాదవ్ ఏవోకి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో గుండా శ్రీనివాస్ గుప్తా, హరి కిషన్, బొజ్జ ఎడ్వర్డ్, చల్లా చంద్రశేఖర్, ఊటుకూరి రవీందర్, రాపర్తి మహేష్, పెద్దింటి శ్యాంసుందర్ రెడ్డి, గుణగంటి సురేష్, అమరగాని నాగేందర్, వల్దాస్ ప్రవీణ్, ఫణీంద్ర, సైదిరెడ్డి, చారి, యాకయ్య, పురుషోత్తం, అయినాల శ్రీనివాస్, వీరన్న నాయక్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News