Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యా ప్రగతికి నిదర్శనంగా మహిళా డిగ్రీ కళాశాల సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 09:22 PM

జర్నలిస్టుల అక్రిడిటేషన్ జీవో 252కు సూర్యాపేటలో నిరసన

జర్నలిస్టుల అక్రిడిటేషన్ జీవో 252కు సూర్యాపేటలో నిరసన

జర్నలిస్టుల అక్రిడిటేషన్ జీవో 252కు సూర్యాపేటలో నిరసన
December 27, 2025 06:45 PM 125 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

జర్నలిస్టుల అక్రిడిటేషన్‌కు జీవో 252పై నిరసన

సూర్యాపేట స్థానికం ప్రతినిధి

సూర్యాపేట: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నూతన అక్రిడిటేషన్ జీవో 252 జర్నలిస్టుల హక్కులను కాలరాస్తుందని టియుడబ్ల్యూజె(H-143) జిల్లా అధ్యక్షుడు వజ్జె వీరయ్య యాదవ్ శనివారం విమర్శించారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు నిర్వహించిన నిరసనలో ఆయన, జర్నలిస్టులకు అన్యాయం చేసే విధంగా జీవో రూపొందించబడిందని తెలిపారు.

గతంలో డెస్క్ జర్నలిస్టులు మరియు సాధారణ జర్నలిస్టులందరికీ ఒకే విధంగా ఉన్న అక్రిడిటేషన్ కార్డులను, తాజాగా డెస్క్ జర్నలిస్టులకు మీడియా కార్డు, సాధారణ జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డు పేరిట వేరు చేస్తూ హక్కులను పరిమితం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ కార్డుతో ఏ ప్రయోజనం ఉంటుందో స్పష్టత ఇవ్వక పోవడం, అక్రిడిటేషన్ కార్డుల సంఖ్యను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని దృష్టి సారించారు.

జర్నలిస్టులకు ప్రయోజనకరంగా జీవోను సవరించాలని డిమాండ్ చేస్తూ, వజ్జె వీరయ్య యాదవ్ ఏవోకి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో గుండా శ్రీనివాస్ గుప్తా, హరి కిషన్, బొజ్జ ఎడ్వర్డ్, చల్లా చంద్రశేఖర్, ఊటుకూరి రవీందర్, రాపర్తి మహేష్, పెద్దింటి శ్యాంసుందర్ రెడ్డి, గుణగంటి సురేష్, అమరగాని నాగేందర్, వల్దాస్ ప్రవీణ్, ఫణీంద్ర, సైదిరెడ్డి, చారి, యాకయ్య, పురుషోత్తం, అయినాల శ్రీనివాస్, వీరన్న నాయక్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News