జర్నలిస్ట్ కొండ మల్లేశం గౌడ్ జన్మదిన వేడుకలు ఘనంగా
జర్నలిస్ట్ కొండ మల్లేశం గౌడ్ జన్మదిన వేడుకలు ఘనంగా
స్థానికం బృందం
రామన్న పేట స్థానిక ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నిదానపల్లి గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ కొండ మల్లేశం గౌడ్ జన్మదిన వేడుకలు శుక్రవారం ఆయన స్వగ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మిత్రులు, శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తున పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.
వేడుకల అనంతరం కేక్ కట్ చేసి జర్నలిస్ట్ మల్లేశం గౌడ్ను శాలువాలతో సత్కరించారు. ప్రజా సమస్యలపై నిరంతరం స్పందిస్తూ, నిజాయితీతో జర్నలిజం చేస్తున్న ఆయన సేవలను పలువురు ప్రశంసించారు. గ్రామాభివృద్ధి, ప్రజా సంక్షేమ అంశాలపై ఆయన చేసిన కృషి మరింత మందికి ప్రేరణగా నిలుస్తోందని అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో ఎస్ ఎస్ ఇంజనీరింగ్ అదినేత కొండా వెంకటేశం గౌడ్, సర్పంచ్ నరపాక మాధవి యాదయ్య, వార్డు మెంబర్ కొండ శ్రీనివాస్ గౌడ్, నాయకులు చల్ల భిక్షం యాదవ్ కొండ శేఖర్ గౌడ్ కొండ భీమయ్య నారపాక అశోక్ బొడ్డుపల్లి తిరుపతి రాచకొండ స్వామి మహేష్ భాష మల్లయ్య కొండ సాయినాథ్ గోగు మధు కొండ గౌతం కడారి ఉదయ్ గోగు కిరణ్ భాష మల్ల వెంకటేశం తదితరులు పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి