Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 12:29 AM

జనరల్ చైర్మన్ స్థానాలు బీసీలకే కేటాయించాలి…

జనరల్ చైర్మన్ స్థానాలు బీసీలకే కేటాయించాలి…

జనరల్ చైర్మన్ స్థానాలు బీసీలకే కేటాయించాలి…
12-02-2026 28 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

బీసీ జనాభా 56 శాతం ఉన్న నేపథ్యంలో న్యాయమైన ప్రాతినిధ్యం ఇవ్వాలని డిమాండ్

బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కొత్త నరసింహస్వామి

యాదాద్రి భువనగిరి జిల్లావ్యాప్తంగా ఇటీవల నిర్వహించిన మున్సిపల్ స్థానిక సంస్థల ఎన్నికల్లో జనరల్ కేటగిరీగా కేటాయించిన చైర్మన్ స్థానాలను బీసీలకే ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు జిల్లా అధ్యక్షులు కొత్త నరసింహస్వామి ఒక పత్రిక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం చేపట్టిన జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో బీసీల శాతం 56 శాతం ఉన్నట్లు అధికారికంగా వెల్లడించిందని ఆయన గుర్తుచేశారు. అలాంటి పరిస్థితిలో బీసీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రకటించినప్పటికీ,టికెట్ల కేటాయింపులో ఆ హామీ నిలబెట్టుకోలేదని ఆయన విమర్శించారు.కనీసం జనరల్ కేటగిరీగా ప్రకటించిన చైర్మన్ స్థానాల్లోనైనా బీసీ వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఇది కేవలం రాజకీయ డిమాండ్ మాత్రమే కాకుండా,సామాజిక న్యాయం సాధనలో ఒక అవసరమైన అడుగు అని కొత్త నరసింహస్వామి స్పష్టం చేశారు.బీసీలకు వారి జనాభా ప్రాతిపదికన సముచిత ప్రాతినిధ్యం కల్పించకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థపై విశ్వాసం దెబ్బతింటుందని హెచ్చరించారు. సామాజిక న్యాయం, సమాన హక్కులు అనే రాజ్యాంగ స్ఫూర్తిని ప్రభుత్వం ఆచరణలో చూపాలని ఆయన కోరారు.

Sthanikam

జనరల్ చైర్మన్ స్థానాలు బీసీలకే కేటాయించాలి…

Article Image

బీసీ జనాభా 56 శాతం ఉన్న నేపథ్యంలో న్యాయమైన ప్రాతినిధ్యం ఇవ్వాలని డిమాండ్

బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కొత్త నరసింహస్వామి

యాదాద్రి భువనగిరి జిల్లావ్యాప్తంగా ఇటీవల నిర్వహించిన మున్సిపల్ స్థానిక సంస్థల ఎన్నికల్లో జనరల్ కేటగిరీగా కేటాయించిన చైర్మన్ స్థానాలను బీసీలకే ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు జిల్లా అధ్యక్షులు కొత్త నరసింహస్వామి ఒక పత్రిక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం చేపట్టిన జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో బీసీల శాతం 56 శాతం ఉన్నట్లు అధికారికంగా వెల్లడించిందని ఆయన గుర్తుచేశారు. అలాంటి పరిస్థితిలో బీసీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రకటించినప్పటికీ,టికెట్ల కేటాయింపులో ఆ హామీ నిలబెట్టుకోలేదని ఆయన విమర్శించారు.కనీసం జనరల్ కేటగిరీగా ప్రకటించిన చైర్మన్ స్థానాల్లోనైనా బీసీ వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఇది కేవలం రాజకీయ డిమాండ్ మాత్రమే కాకుండా,సామాజిక న్యాయం సాధనలో ఒక అవసరమైన అడుగు అని కొత్త నరసింహస్వామి స్పష్టం చేశారు.బీసీలకు వారి జనాభా ప్రాతిపదికన సముచిత ప్రాతినిధ్యం కల్పించకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థపై విశ్వాసం దెబ్బతింటుందని హెచ్చరించారు. సామాజిక న్యాయం, సమాన హక్కులు అనే రాజ్యాంగ స్ఫూర్తిని ప్రభుత్వం ఆచరణలో చూపాలని ఆయన కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News