Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 04:37 AM

జనార్ధనవరం గ్రామంలో సిపిఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి దుర్గం పుల్లారావు ఆధ్వర్యంలో స్టాండింగ్ కమిటీ సమావేశం

జనార్ధనవరం గ్రామంలో సిపిఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి దుర్గం పుల్లారావు ఆధ్వర్యంలో స్టాండింగ్ కమిటీ సమావేశం

జనార్ధనవరం గ్రామంలో సిపిఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి దుర్గం పుల్లారావు ఆధ్వర్యంలో స్టాండింగ్ కమిటీ సమావేశం
05-02-2026 115 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా స్టాండింగ్ కమిటీ సమావేశం చాట్రాయి మండలం జనార్ధనవరం గ్రామంలో జిల్లా కార్యదర్శి దుర్గం పుల్లారావు అధ్యక్షతన జరిగింది. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి హరినాధ్ హాజరయ్యారు కేంద్ర బడ్జెట్ నిరాశపరిచిందని హరినాథ్ విమర్శిస్తూ రాష్ట్రానికి ఏమాత్రం ప్రయోజనం లేదని నాలుగు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఆయా రాష్ట్రాలకు వరాలు జల్లు కురిపిస్తూ, మిగిలిన రాష్ట్రాలకు మొండి చేయి చూపించారన్నారు. చంద్రబాబు ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేసినా రాష్ట్రానికి కేటాయింపుల ద్వారా వొనగూరింది శూన్యం అన్నారు. ఫిబ్రవరి 12వ తేదీ దేశవ్యాప్తంగా మోడీ అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా జరుగు సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని గ్రామ గ్రామాన ఏడో తేదీ మోటార్ సైకిల్ ర్యాలీ ద్వారా ప్రచారం చేయాలని నిర్ణయించడం జరిగిందని, సిపిఐ ఎంఎల్ లిబరేషన్ ఆధ్వర్యంలో ప్రజలు ఎదుర్కొంటున్న తక్షణ సమస్యలపై జనవరి 16, చాట్రాయి 19 ముసునూరు మండల కేంద్రాల వద్ద ధర్నాలు చేయాలని నిర్ణయించడం జరిగిందని, మార్చి రెండవ తేదీ చలో ఏలూరు కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేయాలని కమిటీ నిర్ణయించిందని, చింతలపూడి పేస్ 2ఎత్తిపోతల పథకాన్ని తక్షణం పూర్తి చేయాలని, ఇల్లు లేని వారందరికీ ఇల్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, అటవీ భూముల ఫోర్ నోటిఫికేషన్ రద్దు చేయాలని, ప్రతి గ్రామంలోనూ స్మశాన భూమి మంజూరు చేయాలని జాతీయ ఉపాధి హామీ పథకాన్ని 200 రోజులు రోజుకు 600 రూపాయలు చొప్పున వేతనం ఇవ్వాలని మహాత్మా గాంధీ పేరును కొనసాగించాలని నాలుగు లేబర్ కోడలను రద్దు చేయాలని తదితర డిమాండ్లను రూపొందించి విస్తృతంగా గ్రామాల్లో ప్రచారం చేయాలని నిర్ణయించారు ఈ సమావేశంలో చాట్ల బాబురావు, వేముల బక్కయ్య, కలపాల వెంకటేశ్వరరావు, దుర్గం పూజిత, భవాని, తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు

Sthanikam

జనార్ధనవరం గ్రామంలో సిపిఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి దుర్గం పుల్లారావు ఆధ్వర్యంలో స్టాండింగ్ కమిటీ సమావేశం

Article Image

ఏలూరు జిల్లా స్టాండింగ్ కమిటీ సమావేశం చాట్రాయి మండలం జనార్ధనవరం గ్రామంలో జిల్లా కార్యదర్శి దుర్గం పుల్లారావు అధ్యక్షతన జరిగింది. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి హరినాధ్ హాజరయ్యారు కేంద్ర బడ్జెట్ నిరాశపరిచిందని హరినాథ్ విమర్శిస్తూ రాష్ట్రానికి ఏమాత్రం ప్రయోజనం లేదని నాలుగు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఆయా రాష్ట్రాలకు వరాలు జల్లు కురిపిస్తూ, మిగిలిన రాష్ట్రాలకు మొండి చేయి చూపించారన్నారు. చంద్రబాబు ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేసినా రాష్ట్రానికి కేటాయింపుల ద్వారా వొనగూరింది శూన్యం అన్నారు. ఫిబ్రవరి 12వ తేదీ దేశవ్యాప్తంగా మోడీ అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా జరుగు సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని గ్రామ గ్రామాన ఏడో తేదీ మోటార్ సైకిల్ ర్యాలీ ద్వారా ప్రచారం చేయాలని నిర్ణయించడం జరిగిందని, సిపిఐ ఎంఎల్ లిబరేషన్ ఆధ్వర్యంలో ప్రజలు ఎదుర్కొంటున్న తక్షణ సమస్యలపై జనవరి 16, చాట్రాయి 19 ముసునూరు మండల కేంద్రాల వద్ద ధర్నాలు చేయాలని నిర్ణయించడం జరిగిందని, మార్చి రెండవ తేదీ చలో ఏలూరు కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేయాలని కమిటీ నిర్ణయించిందని, చింతలపూడి పేస్ 2ఎత్తిపోతల పథకాన్ని తక్షణం పూర్తి చేయాలని, ఇల్లు లేని వారందరికీ ఇల్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, అటవీ భూముల ఫోర్ నోటిఫికేషన్ రద్దు చేయాలని, ప్రతి గ్రామంలోనూ స్మశాన భూమి మంజూరు చేయాలని జాతీయ ఉపాధి హామీ పథకాన్ని 200 రోజులు రోజుకు 600 రూపాయలు చొప్పున వేతనం ఇవ్వాలని మహాత్మా గాంధీ పేరును కొనసాగించాలని నాలుగు లేబర్ కోడలను రద్దు చేయాలని తదితర డిమాండ్లను రూపొందించి విస్తృతంగా గ్రామాల్లో ప్రచారం చేయాలని నిర్ణయించారు ఈ సమావేశంలో చాట్ల బాబురావు, వేముల బక్కయ్య, కలపాల వెంకటేశ్వరరావు, దుర్గం పూజిత, భవాని, తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News