జనార్ధనవరం గ్రామంలో సిపిఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి దుర్గం పుల్లారావు ఆధ్వర్యంలో స్టాండింగ్ కమిటీ సమావేశం
జనార్ధనవరం గ్రామంలో సిపిఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి దుర్గం పుల్లారావు ఆధ్వర్యంలో స్టాండింగ్ కమిటీ సమావేశం
GADDAM JAGANMOHAN REDDY
ఏలూరు జిల్లా స్టాండింగ్ కమిటీ సమావేశం చాట్రాయి మండలం జనార్ధనవరం గ్రామంలో జిల్లా కార్యదర్శి దుర్గం పుల్లారావు అధ్యక్షతన జరిగింది. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి హరినాధ్ హాజరయ్యారు కేంద్ర బడ్జెట్ నిరాశపరిచిందని హరినాథ్ విమర్శిస్తూ రాష్ట్రానికి ఏమాత్రం ప్రయోజనం లేదని నాలుగు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఆయా రాష్ట్రాలకు వరాలు జల్లు కురిపిస్తూ, మిగిలిన రాష్ట్రాలకు మొండి చేయి చూపించారన్నారు. చంద్రబాబు ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేసినా రాష్ట్రానికి కేటాయింపుల ద్వారా వొనగూరింది శూన్యం అన్నారు. ఫిబ్రవరి 12వ తేదీ దేశవ్యాప్తంగా మోడీ అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా జరుగు సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని గ్రామ గ్రామాన ఏడో తేదీ మోటార్ సైకిల్ ర్యాలీ ద్వారా ప్రచారం చేయాలని నిర్ణయించడం జరిగిందని, సిపిఐ ఎంఎల్ లిబరేషన్ ఆధ్వర్యంలో ప్రజలు ఎదుర్కొంటున్న తక్షణ సమస్యలపై జనవరి 16, చాట్రాయి 19 ముసునూరు మండల కేంద్రాల వద్ద ధర్నాలు చేయాలని నిర్ణయించడం జరిగిందని, మార్చి రెండవ తేదీ చలో ఏలూరు కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేయాలని కమిటీ నిర్ణయించిందని, చింతలపూడి పేస్ 2ఎత్తిపోతల పథకాన్ని తక్షణం పూర్తి చేయాలని, ఇల్లు లేని వారందరికీ ఇల్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, అటవీ భూముల ఫోర్ నోటిఫికేషన్ రద్దు చేయాలని, ప్రతి గ్రామంలోనూ స్మశాన భూమి మంజూరు చేయాలని జాతీయ ఉపాధి హామీ పథకాన్ని 200 రోజులు రోజుకు 600 రూపాయలు చొప్పున వేతనం ఇవ్వాలని మహాత్మా గాంధీ పేరును కొనసాగించాలని నాలుగు లేబర్ కోడలను రద్దు చేయాలని తదితర డిమాండ్లను రూపొందించి విస్తృతంగా గ్రామాల్లో ప్రచారం చేయాలని నిర్ణయించారు ఈ సమావేశంలో చాట్ల బాబురావు, వేముల బక్కయ్య, కలపాల వెంకటేశ్వరరావు, దుర్గం పూజిత, భవాని, తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి