Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:01 PM

జనార్ధనవరం గ్రామ స్మశాన వాటికలో బోరు బావి ఏర్పాటు

జనార్ధనవరం గ్రామ స్మశాన వాటికలో బోరు బావి ఏర్పాటు

జనార్ధనవరం గ్రామ స్మశాన వాటికలో బోరు బావి ఏర్పాటు
March 10, 2026 09:13 PM 100 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం జనార్ధనవరం గ్రామంలోని స్మశాన వాటికలో నీటి సదుపాయం కల్పించేందుకు బోరు బావి ఏర్పాటు పనులు చేపట్టారు. మండల టిడిపి మహిళా అధ్యక్షురాలు మదాసు చంద్రకళ, గ్రామ టిడిపి అధ్యక్షుడు మదాసు చిన్న పుల్లయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. మంత్రి కొలుసు పార్థసారథి చొరవతో మంజూరైన నిధులతో బోరు డ్రిల్లింగ్ పనులు చేపట్టినట్లు నాయకులు తెలిపారు.

స్మశాన వాటికలో నీటి సమస్యను దృష్టిలో ఉంచుకొని ఈ బోరు బావి ఏర్పాటు చేయడం గ్రామ ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా గ్రామ కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు మంత్రి కొలుసు పార్థసారథికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామ నీటి సంఘం అధ్యక్షుడు వంగల సుబ్బారావు, గ్రామ టిడిపి ప్రధాన కార్యదర్శి బలువూరి రత్తయ్య, కోశాధికారి కాసగాని గోపాలస్వామి, కార్యనిర్వహణ కార్యదర్శి వంగల రమేష్, తెలుగు యువత కార్యదర్శి దార మురళీ, బూత్ కన్వీనర్ చీపు రామారావు, నాయకులు బొరిగొర్ల తిరపతిరావు, చీపు రాఘవేంద్రరావు, రాచకొండ కృష్ణ, బెజవాడ శ్రీనివాసరావు, బొట్ల శ్రీనివాసరావు, చీపు వెంగళరావు, శ్రావణపల్లి నాగేశ్వరరావు, చీపు మల్లేశ్వరరావు, కాసగాని చెన్నారావు, కొత్తపల్లి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News