Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 05:13 AM

జనార్ధనవరం గ్రామ స్మశాన వాటికలో బోరు బావి ఏర్పాటు

జనార్ధనవరం గ్రామ స్మశాన వాటికలో బోరు బావి ఏర్పాటు

జనార్ధనవరం గ్రామ స్మశాన వాటికలో బోరు బావి ఏర్పాటు
March 10, 2026 09:13 PM 106 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం జనార్ధనవరం గ్రామంలోని స్మశాన వాటికలో నీటి సదుపాయం కల్పించేందుకు బోరు బావి ఏర్పాటు పనులు చేపట్టారు. మండల టిడిపి మహిళా అధ్యక్షురాలు మదాసు చంద్రకళ, గ్రామ టిడిపి అధ్యక్షుడు మదాసు చిన్న పుల్లయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. మంత్రి కొలుసు పార్థసారథి చొరవతో మంజూరైన నిధులతో బోరు డ్రిల్లింగ్ పనులు చేపట్టినట్లు నాయకులు తెలిపారు.

స్మశాన వాటికలో నీటి సమస్యను దృష్టిలో ఉంచుకొని ఈ బోరు బావి ఏర్పాటు చేయడం గ్రామ ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా గ్రామ కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు మంత్రి కొలుసు పార్థసారథికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామ నీటి సంఘం అధ్యక్షుడు వంగల సుబ్బారావు, గ్రామ టిడిపి ప్రధాన కార్యదర్శి బలువూరి రత్తయ్య, కోశాధికారి కాసగాని గోపాలస్వామి, కార్యనిర్వహణ కార్యదర్శి వంగల రమేష్, తెలుగు యువత కార్యదర్శి దార మురళీ, బూత్ కన్వీనర్ చీపు రామారావు, నాయకులు బొరిగొర్ల తిరపతిరావు, చీపు రాఘవేంద్రరావు, రాచకొండ కృష్ణ, బెజవాడ శ్రీనివాసరావు, బొట్ల శ్రీనివాసరావు, చీపు వెంగళరావు, శ్రావణపల్లి నాగేశ్వరరావు, చీపు మల్లేశ్వరరావు, కాసగాని చెన్నారావు, కొత్తపల్లి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News